పిలిచి ఎంపీ టిక్కెట్ ఇస్తే సొంత పార్టీ డీసీఎంకు సెగపెట్టిన లీడర్, వందల కోట్ల యవ్యారం !
కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ముద్దహనుమేగౌడ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తుమకూరు జిల్లాలో లింక్ కెనాల్ ద్వారా హేమావతి నీటిని కుణిగల్కు తీసుకెళ్లే ప్రాజెక్టుపై తుమకూరు లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ముద్దహనుమేగౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో తుమకూరు జిల్లా కుణిగల్, తుమకూరుకు నీళ్లు ఇవ్వాలనే నెపంతో రామనగర జిల్లాకు నీళ్లిచ్చే యోచనలో ఉన్నారని, అలాంటి ప్రయత్నాలు జరిగిన సమయంలో తుమకూరు జిల్లా ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఇంత వ్యతిరేకత ఉన్నా డీసీఎం డీకే శివకుమార్ రూ. 910 కోట్లతో లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ బెంగళూరు రూరల్లో లింక్ కెనాల్ (ఎక్స్ప్రెస్ కెనాల్) ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీ బెంగళూరు గ్రామీణ జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తోంది.

ఎక్స్ ప్రెస్ లింక్ కెనాల్ చేయాల్సిన అవసరం లేదని తుమకూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా మాట్లాడటంతో డీకే శివకుమార్ వర్గీయులు హడలిపోయారుతుమకూరులో మీడియా సమవేశంలో ముద్దహనుమేగౌడ్ మాట్లాడుతూ లింక్ కెనాల్ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కాలువ ద్వారా కుణిగల్కు నీరు వెళ్లేలా చూడాలని, ఎక్స్ప్రెస్ కెనాల్ను ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదని ముద్దహనుమేగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎక్స్ ప్రెస్ కెనాల్ ను విడిగా చేయడం వల్ల తుమకూరు జిల్లాలోని ఇతర తాలూకాలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఉన్న ఛానెల్ని విస్తరించనివ్వండి. మన జిల్లా ప్రయోజనాల దృష్ట్యా ఎక్స్ ప్రెస్ ప్రెస్ కెనాల్ ను వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. ఎక్స్ప్రెస్ కెనాల్ ద్వారా ఒక తాలూకాకు నీటిని మళ్లిస్తే, అందరూ అదే పని చేయడం ప్రారంభిస్తారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా తాను ఈ కెనాల్ నిర్మాణంపై వ్యతిరేకత వ్యక్తం చేశానని ముద్దహనుమేగౌడ అన్నారు.

లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సమయంలో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఆలయాలు తిరుగుతున్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణ ఆలయానికి వెళ్లి మహాబలేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మహాబలేశ్వరుడికి రుద్రాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు.
డీసీఎం డీకే శివకుమార్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయన సన్నిహితులు దేవాలయాలకు వెళ్లారు.డీకే శివకుమార్ ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పాన్ని గోకర్ణ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ హవా లేదని, రాముడి హవా అంతకంటే లేదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ గ్యారెంటీకి బదులు మోదీ గ్యారెంటీలు అంటూ బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని డీకే శివకుమార్ వ్యంగంగా అన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications