ఇండియాలో కరోనా కేసులు 99లక్షలకు చేరువగా .. ప్రపంచంలోనే టాప్ 2 ప్లేస్ లో భారత్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులలో ఇండియా రెండో స్థానంలో ఉంది . ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఇండియా రెండవ స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 1,67,37,267 కాగా ఇండియాలో నమోదైన కరోనా కేసులు 98,84,716కు పెరిగాయి. అయితే గత వారం రోజులుగా 30వేల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదవుతూ ఉండడం కాస్త ఊరట.
Recommended Video

24 గంటల్లో భారతదేశంలో 27,071 కొత్త కేసులు
గత 24 గంటల్లో భారతదేశంలో ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన డేటా ప్రకారం 336 కొత్త మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 3,52,586 కాగా మొత్తం రికవరీల సంఖ్య 93,88,159 కు పెరిగింది. కరోనావైరస్ కోసం ఇప్పటివరకు మొత్తం 15,45,66,990 పరీక్షలను నిర్వహించారు. గత 24 గంటల్లో భారతదేశం 27,071 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. ఇప్పటివరకు దేశం మొత్తం కరోనా కేసుల సంఖ్య 98.84 లక్షలకు పైగా ఉంది.

రోజువారీ కేసుల కంటే రికవరీలే ఎక్కువ
30,000 కు పైగా, రోజువారీ రికవరీలు ఇప్పుడు రెండు వారాలకు పైగా కొత్త కేసులను అధిగమించాయి. యాక్టివ్ కేసులు వరుసగా ఏడవ రోజు 4 లక్షల మార్కు కంటే తక్కువగా ఉన్నాయి.
336 కొత్త మరణాలతో, మరణించిన వారి సంఖ్య మొత్తంగా 1,43,355గా ఉంది. సుమారు 6 నెలల్లో మరణాలలో ఇది ఒకే రోజు మరణాల సంఖ్య పెరుగుదల అని చెప్పొచ్చు .ఇప్పటివరకు దేశ రాజధాని నుండి నమోదైన మొత్తం మరణాల సంఖ్య 10,000 దాటింది.

కేరళలో భారీగా పెరుగుతున్న కేసులు ..గత 24 గంటల్లో 4,698 కొత్త కేసులు
మహారాష్ట్ర, తమిళనాడు మరియు కర్ణాటక మాత్రమే ఎక్కువ మరణాలను నమోదు చేసిన రాష్ట్రాలు.
కేరళ మరోసారి భారీగా కరోనా కేసులను నమోదు చేసింది . గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 4,698 కొత్త కేసులు నమోదయ్యాయి . దీంతో కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 6,69,330 కి చేరింది. తాజాగా కేరళ రాష్ట్రంలో రాష్ట్రంలో 29 మరణాలు సంభవించాయి.
ఒక పక్క కేరళ రాష్ట్రంలో శబరిమల యాత్ర నిర్వహిస్తున్న నేపధ్యంలో అక్కడ ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుండి వస్తున్న భక్తుల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది .

మహారాష్ట్ర , ఢిల్లీలలో తాజా కేసుల పరిస్థితి ఇది
మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 18,80,416 కరోనా కేసులు నమోదయ్యాయి, నిన్నటి నుండి 3,717 కొత్త కేసులుకే నమోదు కాగా, గత 24 గంటల్లో డెబ్బై మంది మరణించారు. దీంతో మహారాష్ట్ర లో మరణాల సంఖ్య 48,209కి చేరుకుంది. ఢిల్లీలో ఆదివారం 1,984 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి, దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 6.07 లక్షలకు చేరుకోగా, తాజా మరణాల సంఖ్య 33 కొత్త మరణాలతో 10,000 మార్కును దాటిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ తెలిపింది.












Click it and Unblock the Notifications