పెట్రో ధరలపై దద్దరిల్లిన పార్లమెంటు- రాజ్యసభలో విపక్షాల ఆందోళన-వాయిదాల పర్వం
రెండో దఫా పార్లమెంటు బడ్డెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడిన పార్లమెంటు ఇవాళ తిరిగి ప్రారంభం కావడంతో చమురు ధరల అంశం ఉభయసభల్ని కుదిపేసింది. తొలుత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మహిళా ఎంపీలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. చమురు, వంటగ్యాస్ ధరలపై విపక్ష కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ''పెట్రోల్ ధర రూ.100 దాటింది. వంటగ్యాస్ ధరలు కూడా పెరిగాయి. వీటిపై సుంకాలు, సెస్లను పెంచడంతో యావత్ దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'' అని ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ధరల పెంపునకు నిరసనగా విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఛైర్మన్ వారించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను 11 గంటల వరకు వాయిదా వేశారు.

సభ తిరిగి ప్రారంభమన తర్వాత కూడా రాజ్యసభ ప్రోసీడింగ్స్ను వాయిదా వేసి దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెట్రో ధరల పెంపుపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. కానీ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య మాత్రం చర్చకు అనుమతి ఇవ్వలేదు. ద్రవ్య బిల్లుపై చర్చ తర్వాత అవకాశం ఇస్తానన్నారు. కానీ విపక్షాలు మాత్రం పట్టు వీడలేదు. సమావేశాల తొలిరోజే కఠిన నిర్ణయాలు తీసుకోలేనని నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి వెంకయ్య వ్యాఖ్యానించారు. ఎంపీల నిరసనల మధ్యే సభ మరోసారి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వాయిదా పడింది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications