షాక్: దేశంలో అవినీతి తగ్గుదల, కానీ ...అవినీతిలో ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం
న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిర్వహణ కోసం అధికారుల చేతులు తడపాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని 20 రాష్ట్రాల్లో అవినీతిపై సిఎంఎస్ నిర్వహించిన సర్వేలో దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో అత్యంత పరమచెత్తగా ఉన్నాయి. పైసలు ఇవ్వనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. కర్ణాటక తర్వాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది.
దేశంలోని 20 రాష్ట్రాల్లో 2013 నుండి 2017 మధ్యలో అవినీతిపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సర్వే నిర్వహించింది.ఈ సర్వే ప్రకారంగా కర్ణాటక రాష్ట్రం అవినీతిలో ప్రథమస్థానంలో నిలిచింది.ఆ తర్వాతి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆంద్రప్రదేశ్ తర్వాతి స్థానాన్ని తమిళనాడు నిలిచింది.
అయితే దేశవ్యాప్తంగా అవినీతి విషయంలో కొంత తగ్గుదల కన్పించినప్పటికీ దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితుల్లో మార్పులు రాలేదనే అభిప్రాయాన్ని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

2005 నుండి 2017 మధ్య కాలంలో అవినీతి విషయంలో ప్రజలు జాగ్రత్త పెరిగిందని చెప్పారు..అయితే సుమారు 43 శాతం ఇంటి హౌజ్ హొల్డర్స్ ను ఈ సర్వే నిర్వహిచంారు.
దేశంలోని 20 రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా 77 శాతం ప్రజలు అవినీతి కారణంగా ఇబ్బంది పడుతున్నారని తేలింది.ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 74 శాతం ప్రజలు లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు రాష్ట్రం నిలిచింది. తమిళనాడులో 68 శాతం ప్రజలు అవినీతితో ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. తమిళనాడు తర్వాత మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో 57 శాతం ప్రజలు అవినీతితో ఇబ్బందిపడుతున్నారు.జమ్మూ కాశ్మీర్ లో 44 శాతం ప్రజలు అవినీతి కారణంగా ఇబ్బందిపడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ నిలిచింది.42 శాతం ప్రజలు పంజాబ్ రాష్ట్రంలో అవినీతికి అధికారులు పాల్పడుతున్నారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోని 20 రాష్ట్రాల్లోని 10 పబ్లిక్ సేవలకు సంబందించి సుమారు రూ.6,350 కోట్లను ఖర్చు చేసినట్టు సిఎంఎస్ అంచనావేసింది. అయితే ఈ అవినీతి 2005 తో పోలిస్తే తగ్గుదల కన్పిస్తోంది.అయితే 2005 ఈ సేవలకు గాను 20 రాష్ట్రాల్లో సుమారు రూ.20,500 కోట్లను ఖర్చు చేశారు.
అయితే ఈ విషయాలపై దృష్టిని కేంద్రీకరించాలని నీతి ఆయోగ్ ను కోరినట్టు సిఎంఎస్ ఛైర్మెన్ భాస్కర్ రావు చెప్పారు. అయితే 2005 లో పరిస్థితి మరోలా ఉంది. ఆ సమయంలో బీహార్ రాష్ట్రంలో 74 శాతం అవినీతి ఉండేది. ఆ తర్వాతి స్థానంలో జమ్మూ కాశ్మీర్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 69 శాతం అనినీతి ఉండేది. ఒడిశాలో 60 శాతం, రాజస్థాన్ లో 59 శాతం , ఆ తర్వాత స్థానంలో తమిళనాడు 59 శాతంతో నిలిచింది.అయితే 2005 తో పోలిస్తే కొన్ని రాష్ట్రాల్లో అవినీతి తగ్గింది.కాని, దక్షిణాది మూడు రాష్ట్రాల్లో మాత్రం అవినీతి పరమ చెత్తగా ఉంది.
డీమోనిటీజేషన్ అమలు చేసిన తర్వాత టెలిఫోన్ సర్వే కూడ నిర్వహించినట్టుగా సిఎంఎస్ ప్రకటించింది.అయితే డీమానిటీజేషన్ వల్ల అవినీతి తగ్గిందని ప్రజలు అభిప్రాయపడ్డారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications