ఢిల్లీ ఎఫెక్టా? 'హిందుత్వ'తో మోడీని ఇబ్బంది పెట్టొద్దు: వీహెచ్పీ నేత
లుథియానా: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ సంఘాలు, నేతలు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అంతర్జాతీయ విభాగం అధ్యక్షులు రాఘవ రెడ్డి తప్పు పట్టారు.
అలంటి వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇబ్బందుల్లో పడేయవద్దని ఆయన సూచించారు. చాలా రోజుల తర్వాత హిందూ విశ్వాసాలు, సంస్కృతి వికాసానికి తగిన ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరిందన్నారు. ఇలాంటి సమయంలో హిందుత్వవాదులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

అందరు సంయమనం పాటించాలన్నారు. ప్రధాని మోడీని పని చేయనిద్దామని, ఆయనకు సమయం ఇద్దామని సూచించారు. రానున్న రోజుల్లో భారతీయత స్వప్నాన్ని ప్రధాని మోడీ సాకారం చేస్తారని ఆకాంక్షించారు. ఆయనకు భారతీయుల యొక్క సంస్కృతి, విశ్వాసాలు తెలుసునని అన్నారు.
కాగా, ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బోర్లా పడ్డ విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గాను అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలు గెలుచుకుంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ 3 స్థానాలకే పరిమితం అయింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications