ఎన్నికల సంఘం కొరడా-86 రాజకీయ పార్టీల తొలగింపు-మరో 253 ఇనాక్టివ్ గా ప్రకటన..
దేశంలో జమిలి ఎన్నికల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. అంతకు ముందే సంస్కరణలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల ప్రక్షాళనకు నడుం బిగించింది. దీంతో రాజకీయ ఇన్నాళ్లూ ఆడుతూ పాడుతూ పార్టీలు పెట్టి వాటిని నడిపించకుండా, రద్దు చేయకుండా టైంపాస్ రాజకీయాలు చేస్తున్న పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది మే 25 నుంచి మొత్తం 537 కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా లేని రాజకీయపార్టీలపై ఈసీ చర్యలు తీసుకుంది. వీటిలో 86 నమోదైన, గుర్తింపు లేని రాజకీయ పార్టీలను 'ఉనికిలో లేనివి'గా గుర్తించి వాటిని జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అలాగే 253 రాజకీయ పార్టీల్ని క్రియారహితంగా ప్రకటించింది. బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల నివేదికల ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండేతో కూడిన కమిషన్ 253 పార్టీలపై చర్య తీసుకుంది.

253 పార్టీలు క్రియారహితంగా ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఎందుకంటే వారు వారికి పంపిన లేఖ/నోటీసుకు స్పందించకోవడం, ఒక రాష్ట్ర సాధారణ అసెంబ్లీకి లేదా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడమే కారణమని ఈసీ తెలిపింది. వీటిలో తమిళనాడుకు చెందిన 14 పార్టీలు, ఉత్తరప్రదేశ్ కు చెందిన 34 పార్టీలు, ఢిల్లీకి చెందిన 33 పార్టీలు, తెలంగాణ నుంచి తొమ్మిది, కర్ణాటక నుంచి ఆరుపార్టీలున్నాయి.
రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగించబడిన 86 పార్టీలు సంబంధిత సీఈవోల భౌతిక తనిఖీ తర్వాత, బట్వాడా చేయని లేఖలు, నోటీసుల నివేదిక ఆధారంగా ఉనికిలో లేవని తేలినట్లు ఈసీ వెల్లడించింది.
ఇలా క్రియారహితంగా ప్రకటించిన 253 పార్టీలు 2015 నుంచి 16 కంటే ఎక్కువ దశల్లో ఈసీ నిబంధనల్ని పాటించనట్లుగా, డిఫాల్ట్ అయినట్లుగా తేల్చారు. నిష్క్రియంగా ప్రకటించబడిన పార్టీలు ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ మరియు కేటాయింపు) ఆర్డర్, 1968 ప్రకారం ప్రయోజనాలను పొందేందుకు అర్హత కలిగి ఉండవని ఈసీ తెలిపింది. ఇది పార్టీలు తమ అభ్యర్థుల కోసం ఉమ్మడి గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది.
ఈ 253 పార్టీల్లో 66 పార్టీలు తమ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నాయని.. అయితే ఆయా ఎన్నికల్లో పోటీ చేయలేదని ఈసీ తెలిపింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications