Kasturirangan: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత-సంతాపాల వెల్లువ..!
ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. కస్తూరి రంగన్ ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన సొంత ఇంట్లోనే ఉదయం 10.43కు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కస్తూరి రంగన్ కు 84 ఏళ్లు. ఆయన మృతదేహాన్ని అభిమానుల సందర్శన కోసం బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ)లో ఉంచనున్నారు. ఆదివారం ఉదయం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
1994లో కస్తూరి రంగన్ ఇస్రో ఐదో ఛైర్మన్ గా నియమితులయ్యారు. 2003 వరకూ తొమ్మిదేళ్ల పాటు ఆయన ఇస్రో ఛైర్మన్ తో పాటు ఖగోళశాఖకు కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ కాలంలో కస్తూరి రంగన్ పలు కీలక మిషన్లలో పాలు పంచుకున్నారు. భూమి పరిశీలనకు భారత్ పంపిన రెండు ఉపగ్రహాలు భాస్కర 1,2 రెండింటికీ ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అలాగే భారతదేశ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఐఆర్ఎస్-1ఏకు సారధిగా కూడా పనిచేశారు.

బోంబే యూనివర్సిటీ నుంచి సైన్స్ పట్టభద్రుడైన కస్తూరిరంగన్ కు హానర్స్, ఎమ్మెస్సీ డిగ్రీలు కూడా ఉన్నాయి. 1971లో అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎక్స్ పరిమెంటల్ హై ఎనర్జీ అస్ట్రానమీలో డాక్టరేట్ కూడా పొందారు. కస్తూరిరంగన్ ఇస్రో ఛైర్మన్గా పనిచేసినప్పుడు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తొలిసారి ప్రయోగించారు. అలాగే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క మొదటి విజయవంతమైన విమాన పరీక్ష కూడా ఆయన నాయకత్వంలోనే జరిగింది.
Deeply saddened to learn of the passing of Dr. K. Kasturirangan, former Chairman of #ISRO — an eminent scientist, visionary educator, and passionate environmentalist. He leaves an indelible mark on the annals of India’s space history. My tributes to this legend. May his soul rest… pic.twitter.com/cDEHln1tet
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2025
ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్గా, కొత్త తరం అంతరిక్ష నౌక, ఇండియన్ నేషనల్ శాటిలైట్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, శాస్త్రీయ ఉపగ్రహాల అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం డాక్టర్ కస్తూరిరంగన్ రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా వ్యవహరించారు.
Dr. K. Kasturirangan was a scientist par excellence. As Chairman of the Indian Space Research Organisation, he successfully steered India’s space programs for nine years, leaving an indelible mark on the field. His contributions extended beyond space science. As an educationist,… pic.twitter.com/3kAZJK6Enp
— N Chandrababu Naidu (@ncbn) April 25, 2025
తాజాగా కస్తూరిరంగన్ జాతీయ విద్యా విధానం 2020 కోసం ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించారు. కొత్త జాతీయ పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేసే 12 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీకి కూడా నాయకత్వం వహించారు. కస్తూరి రంగన్ మృతిపై ప్రధాని, పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు సంతాపాలు తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు.
I am deeply saddened by the passing of Dr. K. Kasturirangan, a towering figure in India’s scientific and educational journey. His visionary leadership and selfless contribution to the nation will always be remembered.
— Narendra Modi (@narendramodi) April 25, 2025
He served ISRO with great diligence, steering India’s space… pic.twitter.com/GPdFKPU7b5
Dear Dr. Kasturi Rangan is no more. He had a profound influence in all of us in ISRO. It leaves a vacuum in the community of technocrats and thinkers whose voice is heard by all. I join in the sorrow of the ISRO family and all who admired him. #SomanathSpeak pic.twitter.com/zUDqo16HrO
— Dr. S Somanath (@s_ssnath) April 25, 2025
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications