ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ కు లీక్ .! నోరు విప్పిన జైశంకర్..!
కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. ముందుగా పాకిస్తాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన భారత్.. ఈ విషయాన్ని వెంటనే ప్రపంచ దేశాలకు ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ను పూర్తిస్దాయిలో చేపట్టి పాకిస్తాన్ లో దాడులకు దిగింది. అయితే పాకిస్తాన్ కు దీనిపై ముందుగానే సమాచారం ఇచ్చామని గతంలో విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పి ముందుగా తాము ఉగ్రశిబిరాలు మాత్రమే కూల్చామని, ఎయిర్ బేస్ లు కానీ రక్షణ స్థావరాలు కానీ ముట్టుకోలేదని, అమాయక ప్రజలపై దాడులు చేయడం లేదని విదేశాంగమంత్రి జైశంకర్ గతంలో తెలిపారు. దీంతో ఆపరేషన్ సింధూర్ గురించి ముందే తెలుసుకున్న పాకిస్తాన్ భారత్ పంపిన రాఫెల్ జెట్ల సహా పలు యుద్ధ విమానాలు కూల్చేసిందని, వీటి వివరాలు బయటపెట్టాలని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

రాహుల్ వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ కేంద్రం.. ఈ వివరాలు బయటపెడితే లేని పోని తంటా ఎందుకని మౌనంగానే ఉండిపోయింది. అయితే ఇన్ని రోజులకు విదేశాంగమంత్రి జైశంకర్ పార్లమెంటరీ కమిటీ ముందు ఈ వివరాలు బయటపెట్టారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం అయ్యాక అరగంటకు తాను పాకిస్తాన్ కు పోన్ చేసి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన అరగంటలోపు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పాకిస్తాన్కు సమాచారం ఇచ్చామన్నారు.
Chaired the Consultative Committee Meeting of MEA this morning in Delhi.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 26, 2025
Discussed #OpSindoor and India’s zero-tolerance policy against terrorism in all its forms and manifestations.
Underlined the importance of sending a strong and united message in that regard. pic.twitter.com/xa42X4WJBe
అయితే ఆ తర్వాత పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీ భారత మిలిటరీ ఆపరేషన్స్ డీజీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదించారని, దీనికి భారత్ అంగీకరించడంతో ఇది అమల్లోకి వచ్చిందన్నారు. భారతదేశం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కచ్చితంగా దాడులు చేసిందని, ఉద్రిక్తతలను నివారించడానికి పాకిస్తాన్కు వెంటనే ఈ విషయాన్ని తెలియజేసినట్లు జైశంకర్ పార్లమెంటరీ కమిటీలోి సభ్యులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications