రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు
Recommended Video
న్యూఢిల్లీ: డీజిల్ ధర మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. దేశ రాజధానిలో మంగళవారం పెట్రోల్ ధర లీటర్పై 14పైసలు, డీజిల్ ధర లీటర్పై 15 పైసలు పెరిగింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది.
దీంతో మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో లీటర్ రూ.69.61 వద్దకు చేరింది. లీటర్ పెట్రోల్ ధర కూడా రూ.78.05 వద్ద నిలిచింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం దేశీయ ముడి చమురు దిగుమతులను భారం చేస్తున్నాయి.
ఇక ముంబైలో రూ. 85.47, కోల్కతాలో రూ. 80.98, చెన్నైలో రూ. 81.09గా ఉంది. డీజిల్ ధర కూడా మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. నేడు దిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 69.61కి చేరింది. ఇక ముంబైలో రూ. 73.90, కోల్కతాలో రూ. 72.46, చెన్నైలో రూ. 73.54గా ఉంది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో పాటు వెనుజువెలాలో ఆర్థిక సంక్షోభం, ఆఫ్రికా, ఇరాన్ దేశాల నుంచి సరఫరా తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, సోమవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం 70.16 వద్ద ముగిసింది. దేశీయ చమురు అవసరాల్లో 80 శాతానికిపైగా విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. డీజిల్ ధర 16 పైసలు ఎగిసి రూ.75.56, పెట్రోల్ ధర 14 పైసలు ఎగబాకి రూ.82.60 వద్ద ఉన్నాయి.
ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా రూ.85.33గా పలుకుతున్నది. మే 29న రూ.86.24గా నమోదై ఆల్టైమ్ హైని సృష్టించిన విషయం తెలిసిందే. నాడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.78.43గా ఉన్నది. రూపాయి మారకం విలువ రూ.70 మార్కును దాటిన క్రమంలో ఈ నెల 16 నుంచి ఇంధన ధరలు తిరిగి పురోగమన బాట పట్టాయి. గడిచిన పన్నెండు రోజుల్లో డీజిల్ ధర ఢిల్లీలో 74 పైసలు, పెట్రోల్ 77 పైసలు పుంజుకున్నాయి.