పిఎన్బీ స్కామ్: మరో ముగ్గురి అరెస్టు, ఆర్బీఐదే "వైఫల్యం"
Recommended Video

న్యూఢిల్లీ/ ముంబై :నీరవ్ మోడీ కుంభకోణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్కు చెందిన మరో ముగ్గురు ఉద్యోగులను సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) పర్యవేక్షణ వైఫల్యం వల్లనే కుంభకోణం జరిగిందని కేంద్రం అభిప్రాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ నేపథ్యంలో సిబిఐ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. సిబిఐ ఇదివరకే ఇద్దరిని అరెస్టు చేసింది. తాజాగా అరెస్టయిన అధికారులు పర్యవేక్షణ లోపాలకు కారణమని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ముగ్గురు కూడా ఇది వరకు అరెస్టయిన ఇద్దరు ఉద్యోగుల కన్నా పైస్థాయికి చెందినవారు.

పర్యవేక్షణ వైఫల్యమే
ఓ బ్యాంక్కు చెందిన ఓ శాఖలో జరిగిన ఇంత పెద్ద భారీ కుంభకోణాన్ని రిజర్వ్ బ్యాంక్ పసిగట్టలేకపోవడం దాని వైఫల్యమేనని కేంద్ర ఆర్థిక శాఖ తప్పు పట్టినట్లు తెలుస్తోంది. పద్ధతి ప్రకారం జరిగిన వైఫల్యం పర్యవేక్షణ లోపానికి సంబంధించిందంటూ ప్రభుత్వం ఆర్బీఐకి లేఖ రాసింది.

ఈ ముగ్గురి అరెస్టు
సోమవారం అరెస్టయినవారిలో ఫారిన్ ఎక్స్ఛేంజీ డిపార్టుమెంట్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న చీఫ్ మేనేజర్ బచ్చు తివారీ, అదే శాఖలోని మేనేజర్ యశ్వంత్ జోషీ, మరో బ్యాంక్ అధికారి ప్రఫుల్ సావంత్ ఉన్నారు.

వారిపై లుకవుట్ నోటీసులు..
నీరవ్ మోడీపై, మెహుల్ చోక్సీపై పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. తగిన సాక్ష్యాధారులను సేకరించడానికి సిబిఐ అధికారులు మరోసాని పంజాబ్ నేషలన్ బ్యాంక్ బ్రాంచ్లో సోదాలు నిర్వహించారు.

ఈడి మరిన్ని దాడులు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరిన్ని దాడులు నిర్వహించింది. రూ.22 కోట్ల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. ఏడు ఆస్తులను ఆదాయం పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, జెమ్స్ విలువ రూ.5,671 కోట్ల రూపాయలు ఉంటుంది.

నీరవ్ మోడీ నివాసంలో సోదాలు
కేసుకు సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి బ్యాంకుకు చెందిన ఇద్దరు పిఎన్బీ, ఆర్థిక శాఖ అధికారులను కలిశారు. దక్షిణ ముంబైలోని వొర్లి అప్మార్కెట్లో ఉన్న మోడీకి చెందిన సముద్ర మహల్ అపార్టుమెంట్స్లో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబై, పూణే, ఔరంగాబాద్, కోల్కతా, ఢిల్లీ, జమ్మూ, లక్నో, బెంగళూరు, సూరత్, తదితర నగరాల్లోని 38 చోట్ల సోదాలు కూడా జరిగాయి.

ఆ కంపెనీలపైనా విచారణ
మోడీకి, చోక్సికి చెందిన 110 కంపెనీలు 10 లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లపై విచారణ జరపాలని ప్రభుత్వం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసును ఆదేశించింది. వరుసగా మూడో రోజు కూడా పిఎన్బీ షేర్ వాల్యూ పడిపోయింది. పిఎన్బీ షేర్ వాల్యూ 7.2 శాతం పడిపోగా, చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ షేర్ వాల్యూ 9.9 శాతం పడిపోయింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications