Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ డేట్ ఫిక్స్..! రూట్లు ఇవే..!
భారత్ లో తొలి బుల్లెట్ రైలు పట్టాలపైకి పరుగులు తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది దీనికి సంబంధించిన కార్యక్రమాల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు రైల్వేశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, ఏయే రూట్లలో ముందుగా ప్రయాణం సాగించబోతోందన్న కీలక వివరాల్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇవాళ అధికారికంగా వెల్లడించారు.
ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్లో భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ఆగస్టు 15, 2027న ప్రారంభిస్తామని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అనంతరం దశలవారీగా సూరత్ నుండి బిలిమోరా వరకు విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. సూరత్-బిలిమోరా మధ్య మొదటి దశ 2027లో ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి తెలిపారు. తరువాత వాపి-సూరత్, వాపి-అహ్మదాబాద్, థానే-అహ్మదాబాద్ అలా సాగుతూ.. 2029 నాటికి పూర్తి ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు పరుగులు తీస్తుందన్నారు.

ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య మొత్తం 508-కి.మీ బుల్లెట్ ట్రైన్ కారిడార్ జపనీస్ షింకన్సెన్ టెక్నాలజీతో రూపొందిస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. అలాగే బుల్లెట్ రైలు 320 కి.మీ.వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ముంబై-అహ్మదాబాద్ ప్రయాణాన్ని రెండు గంటల కంటే తక్కువకు ఇది తగ్గిస్తుందన్నారు. 2029 నాటికి కారిడార్ మొత్తం పూర్తిగా రాకపోకలకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే బుల్లెట్ రైలు మార్గం 2025 డిసెంబర్ నాటికి 55 శాతం పూర్తయిందని, 330 కి.మీ మేర వయాడక్ట్లు, 408 కి.మీ. మేర పిల్లర్లు, 17 నది వంతెనలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలో బీకేసీ-షిల్ఫాటా సొరంగంలో 5 కి.మీ.ల టన్నెలింగ్ పనులు, 235 కి.మీ.ల పొడవునా 4.7 లక్షల శబ్ద అడ్డంకులు తొలగించడం వంటి పనులు పూర్తవుతున్నాయి. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుపై రూ.858 బిలియన్లు ఖర్చుచేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications