సేవ్ డెమోక్రసి,.. పార్లమెంట్ గాంధీ విగ్రవం వద్ద విపక్షాల ధర్నా...
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామ వెనుక బీజేపీ హస్తం ఉందంటూ పార్లమెంట్లో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర ప్రతిపక్షాలు పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహాం ముందు ఆందోళన చేపట్టారు. కర్ణాటకతోపాటు,గోవాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు వ్యతిరేకంగా సేవ్ డెమోక్రసి అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ ఆందోళనలో యూపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో పాటు, రాహుల్ గాంధీ, ఎంపీలు ఇతర పార్టీల నేతలు పాల్గోన్నారు.
కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామ చేయడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తింది. రాజీనామ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ముంబాయి హోటల్లో ఆశ్రయం కల్పించడంతో పార్టీ మార్పుకు పోత్సహిస్తున్నారని కాంగ్రెస్ లోక్సభ నేత ఆధీర్ రంజన్ ఆరోపణలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు బీజేపీ నేతలు తిప్పికొట్టారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలకు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో దాని మిత్రపక్షలు బహిరంగ ఆందోళనకు దిగాయి. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.కాగా ధర్నాలో కాంగ్రస్తోపాటు ఎన్సీపీ, టీఎంసీ,ఎస్పీ పార్టీల ఎంపీలు పాల్గోన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications