మోడీ షాక్: కాంగ్రెస్ మంత్రికి ఐటీ సమన్లు, విచారణకు హాజరైన డీకే బ్రదర్స్ అండ్ కో !
ఆదాయపన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చెయ్యడంతో కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ సోమవారం విచారణకు హాజరైనారు. మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు.
బెంగళూరు: ఆదాయపన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చెయ్యడంతో కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ సోమవారం విచారణకు హాజరైనారు. మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా పార్లమెంట్ సభ్యుడు (కాంగ్రెస్) డీకే. సురేష్ విచారణకు హాజరైనారు.
బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయం నాలుగో అంతస్తులో మంత్రి డీకే. శివకుమార్, డీకే. సురేష్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎస్. రవి, ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకనాథ్ తదితరులను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారరణ చేస్తున్నారు.

మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు పరిశీలించిన అధికారులు ముందుగానే ప్రశ్నలు సిద్దం చేసుకుని తరువాత మంత్రి డీకే. శివకుమార్ తో సహ మిగిలిన వారికి సమన్లు జారీ చేసి విచారణ మొదలు పెట్టారు.
మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితుడు, ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకనాథ్ విచారణలో ఏం చెబుతారో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంత్రి దగ్గర వివరణ తీసుకున్న తరువాత అధికారులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలిసింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications