మహా ఎన్నికలకు ఏపీ బీజేపీ నేతలు-కీలక బాధ్యతలు అప్పగించిన మోడీ..!
మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పారిశ్రామిక రాష్ట్రమైన మహారాష్ట్రలో గత లోక్ సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో ఏ అవకాశాన్నీ వదులుకోరాదని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ బీజేపీకి చెందిన ముగ్గురు నేతల్ని మహారాష్ట్ర ఎన్నికల బాథ్యతల్లో నియమించింది.
మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, రాష్ట్ర పార్టీ ప్రధాన సెక్రటరీగా ఉన్న మధుకర్ ను మూడు ప్రాంతాలకు పరిశీలకులుగా నియమించారు. ఇందులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నాందెడ్ ప్రాంతానికి విష్ణువర్ధన్ రెడ్డిని పరిశీలకునిగా నియమించారు. హైకమాండ్ ఆదేశాలతో నాందెడ్ వెళ్లిన ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

మరో ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నాసిక్ ప్రాంతానికి పరిశీలనిగా వెళ్లారు. నాసిక్ లో కూడా తెలుగు వారు ఉంటారు. షిరిడికి వెళ్లే భక్తులు దగ్గరలో ఉన్న నాసిక్ కు కూడా వెళ్తుంటారు. అలాగే ఇక్కడి జ్యోతిర్లింగ క్షేత్రం ప్రసిద్ధి చెందినది. టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టు ఉంది. ఈ సారి ఎన్నికల్లో మరోసారి అక్కడ బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే నాసిక్ పరిశీలకుడిగా పీవీఎన్ మాధవ్ ను పంపారు. ఇక బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్న మథుకర్ ను మరఠ్వాడా మెత్తం ప్రాంతానికి పరిశీలకునిగా నియమించారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications