నోట్ల రద్దు.. రూ.కోటి గెలవొచ్చు: ఆన్లైన్ లావాదేవీలపై రూ.340 కోట్ల బంపరాఫర్!
ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఒక్కో ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. డిజిటల్ లావాదేవీలు పెంపొందించేందుకు డబ్బులు గెలుచుకునే రెండు లక్కీ డ్రా పథకాలను కేంద్రం గురువారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఒక్కో ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. డిజిటల్ లావాదేవీలు పెంపొందించేందుకు డబ్బులు గెలుచుకునే రెండు లక్కీ డ్రా పథకాలను కేంద్రం గురువారం ప్రకటించింది.
నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ పథకాల వివరాలను ఈ రోజు వెల్లడించారు. వినియోగదారుల కోసం లక్కీ గ్రాహక్ యోజన, వ్యాపారుల కోసం డీజీ ధన్ వ్యాపారీ యోజన పథకాలను డిసెంబర్ 25వ తేదీన ప్రారంభం అవుతాయని చెప్పారు.
డిసెంబర్ 25వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు సుమారు వంద రోజుల పాటు జరిపే డిజిటల్ లావాదేవీలలో సుమారు రూ.340 కోట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు జరిపే క్యాష్ లెస్ లావాదేవీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
ఈ బహుమతులు రోజువారీ, వారం వారి, మెగా అవార్డుల కేటగిరీలుగా విభజించారు. ఇలా సుమారు రూ.1 కోటి వరకు గెలుపొందవచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం వేగంగా ముందుకు పోతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు బహుమతులకు శ్రీకారం చుట్టింది.

ఇదీ లెక్క
వినియోగదారులకు చెందిన లక్కీ గ్రాహక్ యోజన పథకం కింద ప్రతిరోజు 15వేల మంది విజేతలను ఎంపికచేసి వారికి రూ.1000 చొప్పున ప్రోత్సాహకం ఇస్తారు. అలాగే వారానికి ఒకసారికి లక్కీ గ్రాహక్ యోజన కింద ఎంపిక చేసిన ఏడు వేల మందికి రూ.లక్ష వరకు ప్రోత్సాహకాలు ఇస్తారు.
డిజి ధన్ వ్యాపారి యోజన పథకం కింద వారానికొకసారి ఏడువేల మందిని ఎంపికచేస్తారు. వారికి రూ.50వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తారు.
లక్కీ గ్రాహక్ యోజన కింద ముగ్గురికి మెగా అవార్డులు ఇస్తారు. మొదటి విజేతకు రూ.కోటి, రెండో విజేతకు రూ.50లక్షలు, మూడో విజేతకు రూ.25లక్షల చొప్పున అందజేస్తారు.
అలాగే డిజి ధన్ వ్యాపారి యోజన పథకం కింద కూడా మెగా అవార్డులు ప్రకటించారు. మొదటి విజేతకు రూ.50 లక్షలు, రెండో విజేతకు రూ.25 లక్షలు, మూడో విజేతకు రూ.5లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు అమితాబ్ కాంత్ తెలిపారు. ఈ మెగా అవార్డులను ఏప్రిల్ 14న ప్రదానం చేయనున్నారు. ఈ పథకం 25 డిసెంబర్ 2016 నుంచి 14 ఏప్రిల్ 2017 వరకు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications