Parliament : జీ20 సక్సెస్ ఏ ఒక్కరిదీ కాదు-భారత్ సత్తా చాటిన చంద్రయాన్-పార్లమెంట్ లో మోడీ...
ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. పాత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సెషన్ చారిత్రాత్మకమైనదని మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనానికి మారడానికి ముందు, ఇక్కడ ఓ చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మోడీ తెలిపారు. ఈ భవనాన్ని నిర్మించాలని బ్రిటిష్ వారు నిర్ణయం తీసుకున్నారని, దీనిని నిర్మించడానికి తన దేశస్థులు తమ రక్తం, చెమటను వెచ్చించారన్నారు.
గతంలో 75 ఏళ్లుగా ఈ భవనంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతిని కాపాడారని ప్రధాని మోడీ తెలిపారు. మనం కొత్త పార్లమెంటు భవనానికి వెళ్లినా, ఈ భవనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అనంతరం చారిత్రక జీ20 సదస్సు విజయంతో పాటు చంద్రయాన్ 3 విజయంపైనా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, గౌరవం చూసి పొంగిపోయానన్నారు. తనకు దేశం నుండి ఇంత ప్రేమ, గౌరవం లభిస్తాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు. రైల్వేస్టేషన్పై నిద్రిస్తున్న ఓ చిన్నారి పార్లమెంట్లో ఏదో ఒకరోజు మాట్లాడతానని ఊహించలేదన్నారు. దీనికి దేశానికి కృతజ్ఞతలు తెలిపారు.

జీ20 సదస్సు విజయం ఏ ఒక్కరిదీ కాదని, దేశం మొత్తానికి చెందుతుందని ప్రధాని మోడీ ఇవాళ వ్యాఖ్యానించారు. దీన్ని విజయవంతం చేసిన ఎంపీలకు ఆయన అభినందనలు తెలిపారు. మన జీ20 అధ్యక్ష పదవి విజయం భారతదేశ విజయమన్నారు. దీనిని ఒక వ్యక్తి లేదా పార్టీకి ఆపాదించలేమన్నారు. ఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించడం అసాధ్యం అనిపించిందని, కానీ తాము దానిని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇది ప్రతి ఒక్కరికీ గర్వించదగిన విషయమన్నారు.
ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పాత భవనం తరతరాలుగా జరిగిన సమావేశాలకు సాక్షిగా నిలుస్తోందన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సభ్యుల మధ్య స్నేహాన్ని చెక్కుచెదరకుండా ఈ భవనం కాపాడిందన్నారు. ఈ పార్లమెంటు భవనంలో ఎన్నో చర్చలు చేసుకున్నామని, అయినప్పటికీ తాము ఓ కుటుంబంగా ఉండగలిగామన్నారు. ఈ భవనం లోపల తాము ప్రత్యర్థులమని, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకరినొకరు కుటుంబ ప్రేమను కలిగి ఉన్నామని వ్యాఖ్యానించారు. తమ మధ్య ఎలాంటి కఠినమైన భావాలు లేవని, ఇన్నేళ్ల తర్వాత మనం కలుసుకున్నా, తమ మధ్య ప్రేమ ప్రబలంగా ఉంటుందన్నారు
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications