1 రూపాయి జమ: సుప్రీంకోర్టు విధించిన ఫైన్ కట్టిన ప్రశాంత్ భూషణ్, తీర్పు అప్పీల్..
కోర్టు ధిక్కారణకు పాల్పడిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జరిమానా చెల్లించారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఫైన్ కట్టిన ఆయన.. తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే తాను కోర్టు తీర్పును మాత్రం స్వాగతించడం లేదని చెప్పారు. కోర్టు ధిక్కరణ కింద తనకు రూపాయి జరిమానా విధించడంపై రివ్యూ పిటిషన్ వేశానని తెలిపారు.
కోర్టులో జరిమానా జమ చేస్తుంటే.. తాను తీర్పును గౌరవించినట్టు కాదు అని స్పష్టంచేశారు. తనకు ఉన్న హక్కు ప్రకారం తీర్పును రివ్యూ చేశానన్నారు. అంతేకాదు తన పిటిషన్ను ఇదివరకటీ కన్నా విసృత, భిన్న ధర్మాసనం విచారించాలని కోరతానని చెప్పారు. ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ చేయడంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతోపాటు సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డేను విమర్శిస్తూ ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. దానిని సుప్రీంకోర్టు ధర్మాసనం ధిక్కారంగా పరిగణించింది. పిటిషన్ విచారించి ఆయనన దోషిగా తేల్చింది.

Recommended Video
ప్రశాంత్ భూషణ్కు సుప్రీంకోర్టు రూపాయి జరిమానా విధిస్తూ ఆగస్ట్ 31వ తేదీన తీర్పునిచ్చిది. సెప్టెంబర్ 15వ తేదీ లోపు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధించాలని, దాంతోపాటు మూడేళ్లు న్యాయవాద వృత్తిని మానేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆయన జరిమానా చెల్లించారు.
జరిమానా చెల్లించడానికి ఒక్క రూపాయి క్యాంపెయిన్ నిర్వహించానని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. పలువురి నుంచి విరాళాలు సేకరించామన్నారు. తన పక్కనున్న వ్యక్తి నుంచి రూపాయి నాణెం తీసి పట్టుకుని మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన ప్రతి రూపాయితో వేధింపులకు గురయ్యే వారికి ట్రూత్ ఫండ్ ద్వారా సహాయం చేయడానికి ఉపయోగిస్తాం వెల్లడించారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications