'మసాలా వేశావుగా"..! కంగనా రనౌత్ కు సుప్రీం బిగ్ షాక్..!
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు ఇవాళ సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. 2021లో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి పెట్టిన ట్వీట్ విషయంలో పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న కంగనాకు ఊరటనిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు కంగనా అప్పట్లో పెట్టిన ట్వీట్ పై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.
రైతులు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న సమయంలో వృద్ధ నిరసనకారురాలు మహిందర్ కౌర్ గురించి కంగనా రనౌత్ ఒక పోస్ట్ను ఎక్స్ లో షేర్ చేశారు. ఆమె టైమ్ మ్యాగజైన్లో కనిపించిన "దాదీ" అని, ఆమె "100 రూపాయలకే దొరుకుతుందంటూ సెటైర్లు వేస్తూ ట్వీట్ షేర్ చేసారు. అయితే మహిందర్ కౌర్ను షాహీన్బాగ్ నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ దాదిగా భావిస్తూ కంగనా ఈ ట్వీట్ చేశారు. అలాంటి నిరసనకారులు డబ్బు కోసం నిరసనల్లో పాల్గొంటారనే అర్దం వచ్చేలా కంగాన్ ఈ ట్వీట్ చేశారు. దీనిపై తీవ్ర వివాదం రేగడంతో పాటు పరువునష్టం దావా కూడా దాఖలైంది.

ఈ పరువు నష్టం దావా కొట్టేయాలని కోరుతూ గతంలో కంగనా రనౌత్ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో కంగనా పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.. ఆమె తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కంగనా కేవలం రైతులపై ట్వీట్ మాత్రమే చేయలేదని, అందులో తన మసాలా కూడా జోడించిందని ధర్మాసనం గుర్తుచేసింది.

పిటిషనర్ కంగనా తన వ్యాఖ్యలపై అప్పుడే వివరణ ఇచ్చారని, అలాగే పంజాబ్ లో విచారణకు హాజరయ్యే విషయంలో భద్రతా సమస్యలు ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. కంగనా తన వాదనను ట్రయల్ కోర్టు ముందే సమర్పించాలని సూచించింది. కంగనా ట్వీట్ పై వ్యాఖ్యలు చేసేందుకు తమను ప్రేరేపించవద్దంటూ ఆమె లాయర్ ను సున్నితంగా మందలించింది. చివరికి కంగనా పిటిషన్ ను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications