ప్రతీ నెలా రూ.100కోట్ల వసూళ్లు... హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీం ఆదేశిస్తుందా..? రేపే విచారణ...
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అవినీతి కార్యకలాపాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై బుధవారం(మార్చి 24) విచారణ చేపట్టనుంది. తనపై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేయడాన్ని కూడా ఆయన ఈ పిటిషన్లో సవాల్ చేశారు.
పోలీస్ అధికారి పరమ్ వీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ నెలా రూ.100 కోట్లు వసూలు చేసివ్వాలని ముంబై క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్ హెడ్గా పనిచేసిన సచిన్ వాజేకు అనిల్ దేశ్ముఖ్ టార్గెట్ ఫిక్స్ చేశారని ఆరోపించారు. ఇదే విషయంపై పలుమార్లు తన అధికారిక నివాసానికి పిలిపించుకుని సచిన్ వాజేతో మాట్లాడారని చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి ఆయన లేఖ రాశారు.

పరమ్ వీర్ సింగ్ చేసిన ఈ ఆరోపణలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్ముఖ్ పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా హోంమంత్రిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియా ముందుకొచ్చి.. అనిల్ దేశ్ముఖ్ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. పరమ్ వీర్ సింగ్ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
ఫిబ్రవరి నెల మధ్యలో సచిన్ వాజేని అనిల్ దేశ్ముఖ్ తన కార్యాలయానికి పిలిపించుకుని వసూళ్ల గురించి మాట్లాడారని పరమ్ వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను శరద్ పవార్ ఖండించారు. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 16 వరకూ అనిల్ దేశ్ముఖ్ కరోనా కారణంగా ఆస్పత్రిలోనే ఉన్నారని తెలిపారు. కాబట్టి పరమ్ వీర్ సింగ్ ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు.
అంబానీ ఇంటి వద్ద బాంబు కలకలం కేసులో అనుమానితుడిగా సచిన్ వాజేని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో ముంబై కమిషనర్గా ఉన్న పరమ్ వీర్ సింగ్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయితే పరమ్ వీర్ సింగ్ మాత్రం అకారణంగా తనపై వేటు వేశారని ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో హోంమంత్రిపై అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇప్పుడీ విషయం సుప్రీం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications