మాజీ ముఖ్యమంత్రులపై దర్యాఫ్తు చేపట్టాలి: సుప్రీం
ఇనుప ఖనిజం కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ధరం సింగ్, కుమారస్వామిల పాత్రపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు సిట్ను (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఆదేశించింది.
బెంగళూరు: ఇనుప ఖనిజం కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ధరం సింగ్, కుమారస్వామిల పాత్రపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు సిట్ను (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఆదేశించింది.
మూడు నెలల్లో ఓ నివేదిక సమర్పించాలని కర్ణాటక పోలీసులకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి స్పష్టం చేసింది. మరో మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు ఉపశమనం కలిగిస్తూ దర్యాప్తుపై నిలుపుదల ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది.

ఈ కేసులో హైకోర్టు సహా ఇతర ఏ న్యాయస్థానమూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా నిలువరిస్తున్నట్లు జస్టిస్ పీసీఘోష్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
మాజీ ముఖ్యమంత్రులు పలువురు అధికారులతో కలిసి అటవీ భూమిని రిజిస్టర్లనుంచి తొలగించారనీ, భారీస్థాయిలో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వుకునేందుకు అనుమతించారని అబ్రహాం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications