భారత్ లో కాస్త తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు : 38,628 కొత్త కేసులు, 617 మరణాలు

గత కొద్ది రోజులుగా 40వేలకు పైగా నమోదవుతున్న కరోనా కేసులు కాస్త నెమ్మదించాయి. తాజాగా 40 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదు కావడం కాస్త రిలీఫ్ ఇస్తుంది. భారతదేశంలో గత 24 గంటల్లో 38,628 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఈరోజు నమోదైన కేసులు నిన్నటి 44,643 కేసుల కంటే దాదాపు 13 శాతం తక్కువ. ఇదే సమయంలో గత 24 గంటల్లో భారతదేశం 617 మరణాలను కూడా నివేదించింది. ఇది నిన్నటి 464 సంఖ్యపై ఎక్కువగా నమోదైంది. మొత్తం మరణాల సంఖ్య 4,27,371 కి చేరుకుంది.

 4,12,153 కు చేరుకున్న యాక్టివ్ కేసులు

4,12,153 కు చేరుకున్న యాక్టివ్ కేసులు

పాజిటివిటీ రేటు - 100 కి గుర్తించిన పాజిటివ్ కేసుల సంఖ్య - 2.21 శాతంగా ఉంది. గత 12 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు నమోదు అవుతుంది. భారతదేశం యొక్క క్రియాశీల కోవిడ్ -19 గణాంకాలు ఇప్పుడు 4,12,153 వద్ద ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 1.30 శాతానికి తాజాగా మెరుగుపడింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 3,10,55,861 కు పెరిగింది. అయితే మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.

 దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇలా

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇలా

దేశవ్యాప్త టీకా డ్రైవ్ కింద ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం టీకా మోతాదుల సంఖ్య 501 మిలియన్లకు చేరుకుంది. 23 మిలియన్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులు ఇంకా నిర్వహించాల్సిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 511.6 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు అందించినట్టు కేంద్రం వెల్లడించింది . గత 24 గంటల్లో 20,49,220 వ్యాక్సిన్లు ఇచ్చినట్లుగా సమాచారం.

కేరళలో అత్యధికంగా రోజువారీ కేసులు .. తర్వాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే

కేరళలో అత్యధికంగా రోజువారీ కేసులు .. తర్వాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే

రోజువారీ అత్యధిక కోవిడ్ కేసులలో రాష్ట్రాలలో అగ్రగామిగా ఉన్న కేరళ, నేడు 19,948 కేసులను నివేదించింది. కేరళలో చాలా రోజులుగా స్థిరంగా 20,000 కేసులను నివేదిస్తోంది. కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 187 మరణాలను కూడా నివేదించింది. మహారాష్ట్ర, మొత్తం కోవిడ్ కేసుల పరంగా అత్యధికంగా దెబ్బతిన్న రాష్ట్రం, నేడు 5,539 కేసులు నమోదు చేసింది. ఇది నిన్న నమోదైన 9,026 కేసులతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు అనిపిస్తుంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 187 మరణాలు కూడా నమోదయ్యాయి. 2,209 కోవిడ్ కేసులతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 1,985, కర్ణాటకలో 1,805, ఇతర దక్షిణాది రాష్ట్రాలలో రోజువారీ కేసులు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో ఒకే రోజులో 577 కేసులు నమోదయ్యాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో తాజా పరిస్థితి ఇదే

ఈశాన్య రాష్ట్రాల్లో తాజా పరిస్థితి ఇదే

975 కోవిడ్ కేసులతో, ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం ఒక రోజులో అత్యధిక కేసులతో ముందంజలో ఉంది. దాని తర్వాత మిజోరం 722 కేసులు, మణిపూర్ 742 కేసులు, మేఘాలయ 515 కేసులను నమోదు చేశాయి. పర్యాటక ప్రాంతమైన గోవాలో ఒకే రోజు 97 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది ఒక మరణాన్ని కూడా నమోదు చేసింది. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని రోజుకు 2.5 లక్షల డోస్‌ల నుండి రోజుకు 40 లక్షల డోస్‌లకు పెంచినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులో శుక్రవారం భారత్ 50 కోట్ల మార్కును దాటడంతో, మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి "బలమైన ప్రేరణ" లభించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+