''ముఖ్యమంత్రిని నేనే, కృష్ణ చేరికతో అదనంగా 40 సీట్లు మాకే''
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన బిజెపి కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారపీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ ఎం కృష్ణ బిజెపిలో చేరడంతో ఆ పార్టీ
బెంగుళూరు:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన బిజెపి కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారపీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ ఎం కృష్ణ బిజెపిలో చేరడంతో ఆ పార్టీ విజయావకాశాలు మరింత మెరుగయ్యాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ సీట్లున్నాయి.అయితే 150 అసెంబ్లీ సీట్లు సాధించిన పార్టీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోనుంది.

అయితే కర్ణాటక రాష్ట్రంలో 150 అసెంబ్లీ సీట్లు సాధించడం తమకు కష్టం కాదని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బిఎస్ యుడ్యూరప్ప అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ ఎం కృష్ణ బీజేపీలో చేరడం అదనంగా 40 సీట్లు గెలుస్తోందని యడ్యూరప్ప చెప్పారు.
బీజేపిలోకి కృష్ణ చేరడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని యడ్యూరప్ప చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సయంలో బెంగుళూరు అభివృద్ది చెందిందన్నారు.
బెంగుళూరు ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉందన్నారు. ఇది తమకు ఉపయోగపడుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారధ్యంలో కర్ణాటకలో బీజేపీని గెలిపిస్తామన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని యడ్యూరప్ప చెప్పారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications