కర్నాటక ఫేక్ ఓటరు కార్డ్స్పై ఈసీ సీరియస్: రాజరాజేశ్వరినగర్ ఎన్నిక వాయిదా
బెంగలూరు: దాదాపు పదివేల ఫేక్ ఓటరు కార్డులు బయటపడిన రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గం ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికలను మే 28వ తేదీన నిర్వహించనుంది. మే 31న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
నగరంలోని ఓ ఫ్లాట్లో దాదాపు పదివేల నకిలీ ఓటరు కార్డులను ఈసీ గుర్తించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు శనివారం జరగాలి. కానీ పేక్ ఓటరు కార్డులు బయటపడటంతో ఈసీ సీరియస్గా తీసుకోని, ఎన్నికను వాయిదా వేసింది.
కర్నాటకలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓ బీజేపీ అభ్యర్థి మృతి కారణంగా ఓ నియోజకవర్గంలో ఇప్పటికే వాయిదా పడింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వాయిదా పడింది.

రాజరాజేశ్వరి నగర్లో ఫేక్ ఓటరు కార్డుల అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏ ఫ్లాట్లో అయితే ఫేక్ ఓటరు కార్డులు దొరికాయో ఆ ప్లాట్ ఓనర్ కాంగ్రెస్కు అనుకూలమని బీజేపీ అంటే, వారికే అనుకూలమని కాంగ్రెస్ చెబుతోంది.
కాగా, బీజేపీ వర్కర్ రాకేశ్ ఈ ఫేక్ ఓటరు రాకెట్ వెనుక బండారాన్ని బయట పెట్టారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల అన్నారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు ఈ పేక్ రాకెట్ ఓటు వెనుక ఉన్నారని తేల్చారని చెప్పారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications