కర్నాటక ఫేక్ ఓటరు కార్డ్స్పై ఈసీ సీరియస్: రాజరాజేశ్వరినగర్ ఎన్నిక వాయిదా
బెంగలూరు: దాదాపు పదివేల ఫేక్ ఓటరు కార్డులు బయటపడిన రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గం ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికలను మే 28వ తేదీన నిర్వహించనుంది. మే 31న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
నగరంలోని ఓ ఫ్లాట్లో దాదాపు పదివేల నకిలీ ఓటరు కార్డులను ఈసీ గుర్తించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు శనివారం జరగాలి. కానీ పేక్ ఓటరు కార్డులు బయటపడటంతో ఈసీ సీరియస్గా తీసుకోని, ఎన్నికను వాయిదా వేసింది.
కర్నాటకలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓ బీజేపీ అభ్యర్థి మృతి కారణంగా ఓ నియోజకవర్గంలో ఇప్పటికే వాయిదా పడింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వాయిదా పడింది.

రాజరాజేశ్వరి నగర్లో ఫేక్ ఓటరు కార్డుల అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏ ఫ్లాట్లో అయితే ఫేక్ ఓటరు కార్డులు దొరికాయో ఆ ప్లాట్ ఓనర్ కాంగ్రెస్కు అనుకూలమని బీజేపీ అంటే, వారికే అనుకూలమని కాంగ్రెస్ చెబుతోంది.
కాగా, బీజేపీ వర్కర్ రాకేశ్ ఈ ఫేక్ ఓటరు రాకెట్ వెనుక బండారాన్ని బయట పెట్టారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల అన్నారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు ఈ పేక్ రాకెట్ ఓటు వెనుక ఉన్నారని తేల్చారని చెప్పారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications