బెంగాల్ హింసాత్మక ప్రాంతాల్లో గవర్నర్ టూర్-మోడీ, షా స్క్రిప్ట్ ప్రకారమేనన్న టీఎంసీ
పశ్చిమబెంగాల్లో వరుసగా మూడోసారి కొలువుదీరిన మమతా బెనర్జీ ప్రభుత్వానికీ, గవర్నర్కూ మధ్య మరోసారి వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల అనంతరం హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాలన్న గవర్నర్ నిర్ణయం ఈ వివాదానికి కారణమవుతోంది. గవర్నర్ తీరుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ మండిపడుతోంది.
పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల హింసచెలరేగింది. ఇందులో దాదాపు 15 మంది చనిపోయారు. వీరంతా బీజేపీ కార్యకర్తలే కావడంతో కేంద్రం సూచనల మేరకు గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆయా చోట్ల పర్యటించాలని నిర్ణయించారు. నిన్న ప్రభుత్వం వద్దంటున్నా హింస చెలరేగిన ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. తన సొంత కాన్వాయ్తోనే మతభంగ, దిన్హాటా ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. అదే సమయంలో స్ధానికులు గవర్నర్ గో బ్యాక్ నినాదాలు కూడా చేశారు. దీంతో తన వాహనం నుంచి దిగి గవర్నర్ ఇక్కడ రూల్ ఆఫ్ లా నిర్వీర్యం అయిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆ తర్వాత ట్వీట్లలోనూ తన పర్యటనలో జనంలో భయం చూశానన్నారు.

గవర్నర్ పర్యటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. ఇదంతా మోడీ, షాల స్క్రిప్టులో భాగమేనని పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆరోపించారు. రాజ్యాంగంపై గౌరవం లేని మోడీ, షా బెంగాల్లో ఓటమిని అంగీకరించలేకే ఇలాంటి చర్యల్ని ప్రేరేపిస్తున్నారని సిన్హా విమర్శించారు. వారు మమతను శాంతియుతంగా ఉండనివ్వబోరన్నారు. గవర్నర్ ధన్కర్ రీకాల్ కోసం ఇప్పటికే తాము రాష్ట్రపతిని ఆశ్రయించామని, అధినేత్రి మమత కోరితే మరోసారి రాష్ట్రపతిని కలుస్తామని టీఎంసీ ఎంపీ సౌగత్రాయ్ తెలిపారు.
Recommended Video
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications