Work-Life Balance: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ! చైనాకూ, మనకూ ఎంత తేడా ?
పని-జీవిత సమతౌల్యత విషయంలో భారతీయులకూ, చైనీయులకూ పూర్తిగా తేడా ఉంది. దీనిపై ఓ భారతీయ సీఈవోకు చైనా వ్యాపారవేత్త ఇచ్చిన సమాధానం చర్చకు దారి తీస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులపై ఎప్పుడూ పని ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల పరిస్ధితి చెప్పాల్సిన అవసరమే లేదు. భారత్ వంటి భారీ మార్కెట్ కలిగిన దేశాల్లో ఉద్యోగులు అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ ( work-life balance) చేయలేక పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కానీ మన పొరుగునే ఉన్న చైనాలో ఉద్యోగులు మాత్రం ఈ సమస్యకు వెతుక్కున్న పరిష్కారం ఏంటో చూస్తే మన వాళ్లకు కచ్చితంగా ఆశ్చర్యం అనిపించక మానదు. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా జరిగింది.
పని-జీవిత సమతౌల్యత (work-life balance)
భారత్ కు చెందిన ఎనర్జీ ఏఐ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో శుభం మిశ్రా.. తన కొత్త చైనీస్ పార్టనర్ తో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై ఎక్స్ లో జరిపిన సంభాషణను షేర్ చేశారు. ఇందులో భారత్, చైనా సంస్కృతుల్లో అతిపెద్ద తేడా ఏమిటని మిశ్రా ప్రశ్నించగా.. ఆ చైనీస్ వ్యాపారవేత్త తాత్వికంగా సమాధానం ఇస్తాడని అనుకున్నారు. కానీ దానికి బదులు అత్యంత నిష్కర్షగా, ఆచరణాత్మకమైన జవాబు ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం మన సీఈవో గారి వంతయింది.

ఏదో ఒక్కటే మేలంటున్న చైనా
ఆ చైనీస్ వ్యాపారవేత్త మాట్లాడుతూ.. తాము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై ఆన్ లైన్ లో జరిగే చర్చలను నమ్మబోమన్నారు. ఉన్నవి కేవలం రెండు విషయాలు మాత్రమేనని, పని సమయం లేదా వ్యక్తిగత సమయం అని తేల్చేశారు. ఈ సలహా నిష్ఠురంగా ఆచరణాత్మకమైనదిగా మిశ్రాకు అనిపించింది. దీని ప్రకారం భారతీయులు సమతుల్యతను ఊహించుకుంటే, చైనీయులు వేగంగా, స్పష్టంగా పని చేస్తారని ఆయన పేర్కొన్నారు. అంటే ఈ రెండూ ఎప్పటికీ పోల్చుకోలేని విషయాలుగా తేల్చేశారు.

ఆన్ లైన్లో విస్తృత చర్చ
దీనిపై ఆన్ లైన్ లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒక వినియోగదారుడు కొన్నిసార్లు బ్యాలెన్స్ అంటే సమయాన్ని విభజించడం కాదని, ఏ క్షణంలో దేనికి పూర్తి శ్రద్ధ అవసరమో నిర్ణయించుకోవడని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఆయనతో విభేధిస్తూ.. అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కు ప్రాధాన్యతనిచ్చినా విజయవంతమయ్యాయని, లేకపోతే అది కేవలం వేతన రహిత శ్రమగా మిగులుతుందని వాదించారు. ఈ చర్చల వేళ భారత్ లోనూ ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి చెప్పిన వారానికి 70 గంటల పని విధానం కూడా తెరపైకి వస్తోంది.
-
APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-ఇకపై ఏటా ఇలా..! -
ఉద్యోగులకు ఆడీ కార్లను గిఫ్ట్గా ఇచ్చిన కంపెనీ.. వీడియో వైరల్ !! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..!












Click it and Unblock the Notifications