Yogi Adityanath : యోగీ ఆదిత్యనాథ్ రికార్డు- నోయిడాలో ఒక్కరోజులో 124 ప్రాజెక్టుల ప్రారంభం..
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు తీయిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. మరో రికార్డు సృష్టించారు. నోయిడాతో పాటు గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే ఏకంగా 124 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంఖుస్ధాపనలు పూర్తి చేశారు. నోయిడా స్టేడియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నోయిడా, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అమథారిటీ ఆధ్వర్యంలో రూ.1,719 కోట్ల విలువైన 124 అభివృద్ధి ప్రాజెక్టులను యోగీ ప్రారంభించారు, అలాగే మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
కేబుల్ బ్రిడ్జ్ తరహాలో నిర్మించిన పార్థాల ఫ్లైఓవర్ నుండి వేద్ వాన్ పార్క్ వరకు పలు ప్రాజెక్టులకు యోగీ ఆదిత్యనాథ్ ప్రారంభోత్సవాలు చేశారు. జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్థాల ఫ్లైఓవర్ ను రూ.84 కోట్లతో నిర్మించారు. నోయిడా నుండి గ్రేటర్ (పశ్చిమ) వరకు MP-3 రహదారిని కలుపుతుంది. ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జ్ తరహాలోనే ఇది కేబుల్ మోడల్ లో నిర్మించారు. ఇది 650 మీటర్ల పొడవుతో క్యారేజ్వేకి ఇరువైపులా మొత్తం 28 కేబుళ్లను వాడి నిర్మించారు. సెక్టార్ 78లో వేద్ వాన్ పార్క్ 12 ఎకరాల్లో రూ.22.68 కోట్లతో నిర్మించారు.

గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయంలో 'సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్' నిర్వహించిన మరొక కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్..మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు. మన సంస్కృతిపై ఏదైనా దాడి జరిగినా లేదా జరుగుతున్నా, అది డిజిటల్ మీడియా లేదా మరేదైనా మాధ్యమం ద్వారా అయినా, దాని విధానం మారిందని యోగీ తెలిపారు. ఆ పద్ధతులను మనం అర్థం చేసుకోవాలన్నారు. స్మార్ట్ఫోన్లలో గేమింగ్ ద్వారా మార్పిడులు చేస్తున్న ఓ గ్యాంగ్ కేసును పోలీసులు తాజాగా గుర్తించారన్నారు.

గతంలో వికలాంగ పిల్లలను లక్ష్యంగా చేసుకునే మరో ముఠాను పోలీసులు ఛేదించారని యోగీ గుర్తుచేశారు. వారు పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇచ్చారని, వారి ముఠా పరిధి కేవలం యూపీకే పరిమితం కాలేదని, 25-30 రాష్ట్రాలకు విస్తరించారని తెలిపారు.
మత మార్పిడి సంఘటనలు ఉత్తరప్రదేశ్లో మాత్రమే జరగడం లేదని, ఇటీవల ఢిల్లీ, ముంబైలో జరిగిన సంఘటనలు దీనికి ఉదాహరణ అని యోగీ తెలిపారు. 2020లో యూపీలో ఇలాంటి రెండు మూడు ఘటనలు జరిగినప్పుడు తాము ఆర్డినెన్స్ తెచ్చి చట్టం ఆమోదించామన్నారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications