స్వర్గానికి వెళ్తా- 15 డాలర్లు విరాళమివ్వండి-ట్రంప్ మరో షాక్..!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనలో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. విదేశాలపై అక్కసు వెళ్లగక్కడం దగ్గర నుంచీ ఆయన మరణంపై వస్తున్న ఊహాగానాల వరకూ ప్రతీదీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కు ఏదైనా జరగరానిది జరిగితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమంటూ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం క్లారిటీ ఇచ్చేశారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ నేపథ్యంలో ఆయన అంతకంటే పెద్ద దాన్నే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. స్వర్గానికి మార్గం లభించాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యం గురించి , తన మరణ పుకార్ల గురించి ఊహాగానాల నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు స్వర్గానికి చేరుకోవడానికి తన మద్దతుదారులను 15 డాలర్లు విరాళంగా ఇవ్వాలని కోరారు.

తాను స్వర్గానికి చేరుకోవడానికి ప్రయత్నించాలనుకుంటున్నట్లు ట్రంప్ తన టీమ్ కు తెలిపారు. గత సంవత్సరం తనపై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన ఓసారి గుర్తుచేసుకున్నారు. గత సంవత్సరం ఆ బుల్లెట్ తన చర్మం గుండా దూసుకెళ్లినప్పుడు తాను మరణం నుండి మిల్లీమీటర్ల దూరంలో బయటపడ్డానన్నారు. వైట్ హౌస్కు తన విజయవంతమైన రీఎంట్రీ జరగకూడదు, కానీ దేవుడు తనను ఒక కారణం వల్ల రక్షించాడని నమ్ముతున్నానని ట్రంప్ తెలిపారు. అది అమెరికాను గొప్పగా మార్చడానికి అన్నారు. అందుకే తాను 24-గంటల ట్రంప్ నిధుల సేకరణ బ్లిట్జ్ను ప్రారంభించాను , దానిని రికార్డు పుస్తకాలలో ఒకటిగా చేయడానికి ప్రతి ఒక్కరూ 15 చెల్లించాలని అడుగుతున్నానంటూ ఆయన టీమ్ లో పంపిన ఈ-మెయిల్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications