శ్రీలంక పేలుళ్లలో కీలక పాత్రదారులు, సంపన్న కుటుంభికులు
ఆత్మహుతి దాడులను చేయించేందుకు , ఉగ్రవాద దిశగా ఆకర్షించేందకు ఆర్ధికంగా వెనకబడిన కుటుంభాలతో పాటు ఇతర సామాజిక కారణాలు ఆసరాగా చేసుకుని తమవైపుకు తిప్పుకుంటాయి తీవ్రవాద సంస్థలు . అయితే శ్రీలంక బాంబు దాడుల్లో పాల్గోన్నది మాత్రం శ్రీలంకలోని ఓ సంపన్న కుటుంభానికి చెందిన వారంటే అశ్చర్యపడక తప్పదు. అత్యున్నతమైన స్థాయిలో ఉండి ఇలా వందాలాది ప్రాణాలకు బలిగొన్న వారు మేము గౌరవించిన వారేనా అంటూ చుట్టుపక్కల ప్రజలు ఆశ్చార్యానికి లోనవుతున్నారు.
సుగంధ ద్రవ్యాల వ్యాపారీ కుమారులు
శ్రీలంక బాంబ్ బ్లాస్ట్ లో, సంపన్న కుటుంభానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పాల్గోన్నారు. సుసైడ్ బాంబర్ గా మారిన వారిలో ఉన్న ఇన్షాఫ్ ఇబ్రహం ,మరియు ఇల్హాం ఇబ్రహం అనే ఇద్దరు అన్నదమ్ములు పాల్గోన్నారు. కాగా వారు పేరుమోసిన సుగంధ ద్రవ్యాల వ్యాపారుడి కుమారులు , ప్రత్యేకంగా వ్యాపారాలు చెస్తున్నవారు, బాంబుదాడిలో కీలక పాత్ర పోషించారు. కాగా 33 సంవత్సరాల ఇన్షాఫ్ ఇబ్రహం ఒక కాపర్ ఫ్యాక్టరీ యజమాని కాగా ఇల్హామ్ ఇబ్రమం పేరుమోసిన నగల వ్యాపారి కూతురును పెళ్లి చేసుకున్నారు.
వారు చాల మంచి వారు అనుకున్నాం
కాగా ఆత్మహుతి దాడిలో పాల్గోన్న సోదరుల తండ్రి కి చాల పేరుంది. ఇన్నాళ్లు తమ పక్కనే ఉంటున్న సంపన్న కుటుంభం కావడంతో వారు చాల మంచివారు అనుకున్నాం ,వారు ఇలాంటీ కార్యకలాపాలకు పాల్పడతారని మేము భావించాలేదని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. వారి చాల మంచి వాడని అందరిని ఆదుకుంటాడని చెప్పారు, తన ఫ్యాక్టరీలో ఎవరికైన ఇబ్బంది కల్గితే స్పందిస్తారని వారు చెబుతున్నారు. కాగా ఈ సంఘటనతో ఒక వర్గానికి చెందని ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు వాపోతున్నారు. కాగా ప్రస్థుతానికి వారి తండ్రి పోలీస్ కస్టడి లో ఉన్నాడు.
ఉగ్రవాద సిద్దాంతాలను బహిరంగంగానే చెప్పెవాడు.
ఆత్మహుతి దాడులకు పాల్పడ్డ ఇల్హామ్ ఇబ్రహిం స్థానిక టెర్రర్ గ్రూప్ ఎన్టీజే సానుభూతిపరడుగా చెబుతున్నారు. కాగా తన టెర్రరిస్టు సిద్దాంతాలను ఓపెన్ గానే చెప్పేవాడని తెలిపారు. మరోవైపు ఇన్షామ్ కూడ కొంత మోడరేట్ గా ఆలోంచించే వాడని చెబుతున్నారు. ఇతను కూడ తన వద్ద ఉన్న ఉద్యోగులకు , ఇతరులకు సైతం సహయం చేశాడని చెబుతున్నారు. ఇన్షాఫ్ ఇబ్రహీం బిజీగా ఉన్న విలాసవంతమైన షాంగ్రి-లా హోటల్ యొక్క వద్ద విస్ఫోటనం చేశారు.