శశిథరూర్ కు కొలంబియాలో ఊహించని షాక్..! ఆపరేషన్ సింధూర్ పై సీన్ రివర్స్ ?
కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఆ దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచింది. కాల్పుల విరమణకు వినతులు పంపడంతో భారత్ దాన్ని అంగీకరించి యుద్దాన్ని ముగించింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతు విషయంలో మాత్రం వెనక్కి తగ్గరాదని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐరాస భద్రతా మండలిలోని 15 సభ్యదేశాలతో పాటు భారత్ మిత్రదేశాలకు అఖిలపక్ష ఎంపీల బృందాల్ని పంపి పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతుని వివరిస్తోంది.
ఇందులో భాగంగా అమెరికాతో పాటు దాని చుట్టుపక్కల దేశాల్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని బృందానికి దక్షిణ అమెరికాలోని కొలంబియాలో అనుకోని షాక్ తగిలింది. పాకిస్తాన్ ఉగ్రచర్యల్ని వివరించి భారత్ కు మద్దతు సంపాదించేందుకు వెళ్లిన శశిథరూర్ బృందం తమ వివరణ ఇచ్చేలోపే కొలంబియా ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన పాకిస్తాన్ పౌరులకు సంతాపం ప్రకటించింది. దీంతో శశిథరూర్ బృందం షాకయ్యింది.

భారత దాడుల తర్వాత పాకిస్తాన్లో జరిగిన ప్రాణనష్టానికి హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేసిన కొలంబియా ప్రభుత్వ ప్రతిస్పందన తమకు కాస్త నిరాశ కలిగించిందని ఈ సందర్భంగా శశిథరూర్ వెల్లడించారు. ఉగ్రవాద బాధితుల పట్ల సానుభూతి చూపడం కంటే కొలంబియాలోని తమ స్నేహితులకు ఉగ్రవాదులను పంపేవారికి, వారిని ప్రతిఘటించేవారికి మధ్య ఎటువంటి సమానత్వం ఉండదని తాము చెప్తామని థరూర్ తెలిపారు. దాడి చేసేవారికి, రక్షించేవారికి మధ్య ఎటువంటి సమానత్వం ఉండదన్నారు.
#WATCH | Bogotá, Colombia | Congress MP Shashi Tharoor says, "We were a little disappointed in the reaction of the Colombian government, which apparently expressed heartfelt condolences on the loss of lives in Pakistan after the Indian strikes, rather than sympathising with the… pic.twitter.com/AgpOMpNpSt
— ANI (@ANI) May 30, 2025
తాము తమకు ఉన్న ఆత్మరక్షణ హక్కును మాత్రమే వినియోగించుకుంటున్నట్లు థరూర్ తెలిపారు. అవాగే ఈ అంశంలో ఏదైనా అపార్థం ఉంటే, దాన్ని తొలగించడానికి తాము కొలంబియాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కొలంబియాకు వాస్తవ పరిస్దితుల్ని వివరిస్తామని ఆయన తెలిపారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications