డెమోక్రసీకి ముప్పు: కమలా హ్యారిస్ ఆందోళన, ఏం చేద్దామంటే
ప్రధాని నరేంద్ర మోడీని తన కార్యాలయానికి ఆహ్వానించారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్. ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ముప్పు గురించి ఆమె ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, అమెరికాలో ప్రజాస్వామిక సిద్ధాంతాలను, వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు దేశాల్లో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక సిద్ధాంతాలను, వ్యవస్థలను కాపాడుకోవడం తప్పనిసరి అని స్పష్టంచేశారు.
దేశీయంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేయవలసిన అంశాలు తప్పనిసరిగా చేయాలని కోరారు. ఇరు దేశాల ప్రజల ఉత్తమ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉభయ దేశాలపై ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పట్ల భారతీయుల నిబద్ధత గురించి తనకు తన వ్యక్తిగత అనుభవం, తన కుటుంబం ద్వారా తెలుసునని ఆమె చెప్పారు. ప్రజాస్వామిక సిద్ధాంతాలు, వ్యవస్థల కోసం కలలు కనడం ప్రారంభించేందుకు, వాటిని వాస్తవంగా సాధించేందుకు మనం కృషి చేయాలన్నారు. కాసేపట్లో అమెరికా అధ్యక్షుడు జో బిడైన్తో మోడీ మీట్ అవుతారు. ఆ తర్వాత క్వాడ్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications