US Shutdown: హెచ్1బీ వీసాలు, ఇమ్మిగ్రేషన్, విదేశీ విద్యార్థులకు ఎఫెక్ట్ ఇదే ..!
అమెరికా ప్రభుత్వం పంపిన ఖర్చుల బిల్లుల్ని సెనేట్ ఆమోదించకపోవడంతో షట్ డౌన్ కు తెరలేచింది. దీంతో పలు ప్రభుత్వ విభాగాల్లో కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. గతంలో పలుమార్లు ఇలాంటి పరిస్ధితి ఎదురైంది. మరోసారి ట్రంప్ హయాంలో షట్ డౌన్ కు పరిస్ధితులు దారి తీసాయి. ఈ నేపథ్యంలో ఇతర సేవలతో పాటు ఇమ్మిగ్రేషన్, వీసా సేవలపైనా ఈ ప్రభావం పడుతోంది. అయితే ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉంటుందనే దానిపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి.
ఇమ్మిగ్రేషన్ సేవలపై ప్రభావం
యూఎస్ షట్ డౌన్ ప్రభావం అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ సేవలపై వేర్వేరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దరఖాస్తు రుసుములతో నిధులు సమకూర్చుకునే ఏజెన్సీలు పనిచేస్తూనే ఉంటాయని, వార్షిక బడ్జెట్లపై ఆధారపడేవి మాత్రం మూసివేయబడతాయని అధికారులు తెలిపారు. USCIS, స్టేట్ డిపార్ట్మెంట్ కాన్సులేట్లు మాత్రం ప్రస్తుతానికి తెరిచి ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులతో సహా అన్ని వలసేతర వీసా దరఖాస్తుదారులు ప్రామాణిక వీసా ప్రాసెసింగ్ రుసుముతో పాటు 250-డాలర్లు (సుమారు రూ.21 వేలు ) వీసా ఇంటిగ్రిటీ ఫీజు, అలాగే 24-డాలర్లు (సుమారు 2 వేలు ) I-94 రుసుము వంటి అదనపు ఛార్జీలను చెల్లించాలి.

హెచ్1 వీసా దరఖాస్తులపైనా..
హెచ్1బీ వీసాలకు అవసరమైన లేబర్ కండిషన్ అప్లికేషన్స్ ను ధృవీకరించే కార్మిక శాఖ, దాని వ్యవస్థలను మూసివేసింది. ఆమోదించబడిన ఎల్సీఏ లేకుండా, కొత్త H-1B పిటిషన్లు లేదా పొడిగింపులు తీసుకోరు. హెచ్1బీ మినహా మిగతా అన్ని దరఖాస్తులను ప్రస్తుతం దాఖలు చేయవచ్చు. USCIS గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. కానీ హెచ్1బీ కోసం, ఎల్సీఏ తీసుకోవడం అవసరం. ఇది ప్రస్తుత పరిస్థితులలో సాధ్యం కాదు. గడువు ముగిసే వీసాలపై ఉన్నవారికి కూడా ఇబ్బందులు తప్పవు. గ్రీన్ కార్డ్ లేబర్ సర్టిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి.
హెచ్1బీ లాటరీలో ఎంపికైనా పేర్లు ఖరారు కాని వారు ..!
హెచ్1బీ లాటరీ కేసులను దాఖలు చేయడానికి గడువు జూన్ 30 కాబట్టి, వారు ప్రభావితం కారు. దరఖాస్తు ఇంకా పెండింగ్లో ఉంటే, USCIS పనిచేస్తోంది. కాబట్టి దరఖాస్తు చేసుకోవాలనుకునే కొత్త వారు మాత్రమే ప్రభావితమవుతారు. ప్రస్తుతం, కొత్త లాటరీ దరఖాస్తులు లేవు. ఇది పొడిగింపులు, బదిలీలు మరియు సవరణలు మాత్రమే. హెచ్1బీకి సవరణ అంటే పని ప్రారంభించే ముందు దీన్ని దాఖలు చేయాలి.

విదేశీ విద్యార్దులపై
అంతర్జాతీయ విద్యార్థులపై పెద్దగా ప్రభావం లేదు. వారి ఇమ్మిగ్రేషన్ స్థితి SEVISలో నమోదైంది కాబట్టి ఇబ్బంది లేదు. ఫీజులతో నడుస్తున్న వ్యవస్ద కావడమే ఇందుకు కారణం. విశ్వవిద్యాలయాలు తెరిచి ఉంటాయి. తరగతులు యథావిధిగా నడుస్తాయి, విద్యార్థి కార్యాలయాలు పనిచేస్తూనే ఉంటాయి. ఎక్కువగా పరిశోధన కార్యక్రమాలు లేదా కొన్ని ప్రాజెక్టుల పరంగా.... కొన్ని ప్రభుత్వ శాఖ నుండి నిధులు పొందుతున్న వారికి మాత్రమే తాత్కాలిక నిలిపివేత ప్రభావం పడవచ్చు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications