కడపజిల్లాలో టెన్షన్.. వైసీపీ,టీడీపీ వర్గాల ఘర్షణ .. కొడవళ్ళు,రాళ్ళతో దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు, దాడుల నేపధ్యంలో దారుణమైన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నా వాటిని నివారించటానికి ఎలాంటి ప్రయత్నమూ జరగటం లేదు . ఫలితంగా గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసాక కూడా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో కూడా ఘర్షణలు తారా స్థాయికి చేరి కొడవళ్ళు, రాళ్ళతో దాడులకు పాల్పడ్డారు వైసీపీ , టీడీపీ కార్యకర్తలు .
ఎన్నికల తర్వాత నుండీ నేటి వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో దాడుల కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజాగా కడప జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 11 మంది గాయపడ్డారు. చక్రాయపాలెం మండలం కుమారకాల్వ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కొడవళ్లతో దాడికి దిగాయి.ఈ ఘటనలో గాయపడిన 11 మందిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కుమారకాల్వ గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. అసలు వీరు ఎందుకు ఇంతగా దాడులకు పాల్పడ్డారు, వైసీపీ-టీడీపీ వర్గాల ఘర్షణ వెనక కారణాలుఏంటీ అనేది పోలీసులు విచారిస్తున్నారు. రాజకీయ ఘర్షణలను నివారించేందుకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడ పరిస్థితుల్లో మార్పు రావటం లేదు .ఇక ఈ దాడుల్లో గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. అధికార, విపక్ష పార్టీల వర్గాల మధ్య ఘర్షణలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications