కడప చేరుకున్న వైఎస్ జగన్! రేపట్నుంచి పులివెందులలో ప్రజాదర్బార్
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కడపకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన సాయంత్రానికి కడపకు చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తన స్వస్థలం పులివెందులకు బయలుదేరి వెళ్లారు. రెండురోజుల పాటు వైఎస్ జగన్ పులివెందులలోనే ఉంటారు. బుధ, గురువారాల్లో ఆయన అక్కడే ఉంటారు. పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం లేదా.. శుక్రవారం ఉదయం ఆయన మళ్లీ హైదరాబాద్కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రజా దర్బార్ నిర్వహించడం ఆనవాయితీ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైఎస్ జగన్ అందుబాటులో లేని సమయంలో పార్టీ కీలక నాయకులు దీన్ని నిర్వహిస్తుంటారు.

నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించడానికి, వారి అభిప్రాయాలను సేకరించడానికి ప్రజా దర్బార్ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. వేసవిలో పులివెందుల నియోజకవర్గం పరిధిలో మంచినీటి సమస్య, సాగునీటి సమస్య, నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఆయా అంశాలతో పాటు స్థానిక విషయాలు కూడా ప్రజాదర్బార్లో ప్రస్తావనకు వస్తాయని తెలుస్తోంది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications