మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ట్విస్ట్ .. ఆ నిందితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు
Recommended Video
వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు .. ఏపీలో ఒక మిస్టరీగా మారిన కేసు ఇది . ఇక ఈ కేసుపై జగన్ దృష్టి సారించారు. అందుకే కొత్త సిట్ ను నియమించి విచారణ వేగవంతం చేయించారు. ఇదిలా ఉంటె మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైన వెంకట కృష్ణారెడ్డి, ప్రకాష్ లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి న్యాయమూర్తి పిటీషన్ ను డిస్మిస్ చెయ్యటానికి సిద్ధం కాగా పిటిషన్ల ను ఉపసంహరించుకుంటున్నామని పిటీషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీనికి కోర్టు అంగీకరించింది.

వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆకస్మిక మలుపు.. బెయిల్ కోరిన వివేకా హత్యకేసు నిందితులు
వివేకా హత్యా కేసులో ట్విస్ట్ నెలకొంది.మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆకస్మిక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్ను కొట్టివేయాలని హైకోర్టు నిర్ణయం తీసుకునే ముందే పిటిషన్ను ఉపసంహరించుకుంటామని నిందితుల తరపు న్యాయవాది బిఆర్ రెడ్డి తెలిపారు . నిందితుడు వివేకానందరెడ్డి పిఏగా పని చేసిన ఎం వెంకట కృష్ణారెడ్డి, నిందితుడు ప్రకాష్ లకు సాక్ష్యాలను రూపు మాపి హత్యకు సహకరించిన కారణంతో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . ఇక వీరు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది.

వాదన వినిపించిన పిటీషనర్ల తరపు న్యాయవాది .. బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి
పిటీషనర్ల తరపు న్యాయవాది ఎన్నికలకు ముందు ఏపీలో ముఖ్య నేత అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని ఇక అప్పటి ప్రభుత్వం దాని ప్రభావం అధికార పార్టీ మీద పడుతుందన్న ఉద్దేశంతో వెంకట కృష్ణా రెడ్డిని, ప్రకాష్ లను అరెస్ట్ చేశారని, ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారని పేర్కొన్నారు. హత్య నేపధ్యంలో పోలీసులు హడావిడిగా ప్రవర్తించారని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పేందుకే ఎం వెంకట కృష్ణారెడ్డి, ప్రకాష్ లను అరెస్ట్ చేశారని తెలిపారు . అన్యాయంగా అరెస్ట్ చేశారని ,ఇప్పటికే 60 రోజులు శిక్ష అనుభవించారని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. బెయిల్ కు నో చెప్పిన న్యాయమూర్తి
ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తూ వివేకా హత్యానంతరం సాక్ష్యాలను రూపు మాపే ప్రయతం నిందితులు చేశారని, ఇప్పుడు బెయిల్ ఇచ్చి బయటకు పంపితే మరింతగా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని, దాని ప్రభావం కేసుపై పడుతుందని పేర్కొన్నారు. 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదై ఉన్నందున 90 రోజుల జైలు జీవితం అనుభవించిన తర్వాతే బెయిల్ అడగటానికి వీలుంది. కాబట్టి నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని తమ వాదన వినిపించారు. పీపీ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటీషనర్ల అభ్యర్థనలను తిరస్కరిస్తూ డిస్మిస్ చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే పిటీషనర్ల తరపు న్యాయవాది పిటీషన్ ఉపసంహరించుకుంటామని చెప్పటంతో కోర్టు అంగీకరించింది .
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications