తెలంగాణలో ‘కల్లు బార్లు’
మహబూబ్నగర్: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 'కల్లు బార్లు' ఏర్పాటు దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహబూబ్నగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ కులవృత్తులు మారుతున్నాయన్నారు.
నేటికాలంలో అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోందని, వాటితో పాటు గీత కార్మికుల కులవృత్తిని ఆధునీకరించుకునే అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో "కల్లు బార్లు" ఏర్పాటు చేసుకునే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ప్రకృతిపరంగా వచ్చే పానీయాన్ని కల్తీ లేకుండా గౌరవప్రదంగా అమ్మే విధంగా చర్యలు చేపడతామమని మంత్రి పొన్నం తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 90 రోజులైందని, ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు మంత్రి పొన్నం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయణం చేశారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే, కేంద్రంలోనూ మన రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యులు ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పొన్నం పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వివక్షకు గురయ్యిందని విమర్శించారు. జిల్లాలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రాబోయే ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక అర్హత కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులకు లేదన్నారు. గడిచిన శాసనసభల్లో లక్ష కోట్లు అప్పు మాత్రమే ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఏడాదికి రూ.60 వేల కోట్ల రూపాయల వడ్డీతో కలుపుకొని, రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి ధ్వజమెత్తారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications