నెల్లూరులో కరోనా కలవరం: స్కూల్స్లో పెరుగుతున్న కేసులు
కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో ఇదివరకే స్కూల్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలానే కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇటు నెల్లూరు జిల్లాలో గల కొన్ని పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వెంకటగిరి గురుకుల బాలికల పాఠశాలలో ఈ నెల 6వ తేదీన నలుగురికి కొవిడ్ పాజిటివ్గా వచ్చింది. మొదటిరోజు 80 మంది విద్యార్థినిలకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 18 మందికి కరోనా నిర్ధారణ అయింది. గురుకులంలో మొత్తం 22కు పాజిటివ్ కేసులు చేరాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇటు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 61,363 మంది శాంపిల్స్ పరీక్షించారు. 1,361 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 282 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 13 కేసులు వచ్చాయి. 1,288 మంది కరోనా నుంచి కోలుకోగా... 15 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,24,603కి చేరాయి. మొత్తం 19,96,143 మంది కరోనా వైరస్ కోలుకున్నారు. మృతిచెందిన మొత్తం సంఖ్య 13,950గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. డేల్టా వేరియంట్ డేంజర్ అని నిపుణులు చెప్పడంతో మరింత భయాందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న జాగ్రత్తలు తప్పనిసరి అని పదే పదే హెచ్చరిస్తున్నారు.