నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: మూడు వాహనాల బీభత్సం; ఏడుగురు దుర్మరణం!!
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొట్టడంతో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొట్టాయి. ఈరోజు తెల్లవారుజామున మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది.
ఇక ఇదే సమయంలో ఎదురుగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు రావడంతో లారీ అదుపు తప్పి ట్రావెల్ బస్సు పైకి దూసుకు వెళ్ళింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా, 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని వారిని బయటకు తీసేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు గా మారింది. ఈ ఘటనలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications