రికార్డు వరదను తట్టుకుని నిలబడి..! 103 ఏళ్ల నాటి పోచారం ప్రాజెక్టు ఇంజనీరింగ్ సీక్రెట్!
కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం, వరద నియంత్రణ సాధ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఊహించిన దానికి కంటే పోచారం ప్రాజెక్టు పైనుంచి నీరు ధాటిగా ప్రవహిస్తూ వెళ్లింది. ఈ క్రమంలోనే పోచారం ప్రాజెక్ట్ పక్కన గుంతపడటంతో ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉందని భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా గజగజ వణికిపోయారు. కానీ ఈ ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడింది. 103 ఏళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు అంతటి వరదను సైతం తట్టుకుని ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని నీటిపారుదల శాఖ ప్రకటించింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలోనే.. నిజాం కాలంలో నిర్మించిన పురాతన ప్రాజెక్టులలో పోచారం ప్రాజెక్ట్ ఒకటి. ఇది సంభవించిన భారీ వరద ప్రవాహాన్ని విజయవంతంగా తట్టుకుని నిలిచింది. ఈ ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం (MFD) 70,000 క్యూసెక్కులు మాత్రమే అయినప్పటికీ, ఇటీవల వచ్చిన 1,82,000 క్యూసెక్కుల భారీ వరదను ఇది తట్టుకోగలిగింది. ఈ అపారమైన ఒత్తిడిని సైతం తట్టుకొని ప్రాజెక్ట్ సురక్షితంగా ఉండటం నీటిపారుదల నిపుణులకు, ప్రభుత్వ వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగించింది. ఒక శతాబ్దానికి పైగా బలంగా నిలబడిన ఈ కట్టడం, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.

పోచారం ప్రాజెక్ట్ చారిత్రక, సాంకేతిక వివరాలు
నిజాం ప్రభుత్వం నిర్మించిన తొలి ప్రాజెక్టులలో ఒకటిగా పోచారం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోయింది. దీని నిర్మాణం 1917లో ప్రారంభమై, 1922లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి విలువ ప్రకారం రూ. 27.11 లక్షలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం, పోచారం గ్రామంలో ఉన్న మంచిప్ప చెరువుపై నిర్మించారు. దీని అసలు సామర్థ్యం 2.423 టీఎంసీలు. అయితే, కాలక్రమేణా పూడిక కారణంగా దాని ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు తగ్గింది. ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాలకు సాగునీరు, తాగునీటి అవసరాలను తీరుస్తోంది. దీని కింద మొత్తం 10,500 ఎకరాలకు పైగా భూమి సాగులోకి వస్తోంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సున్నపురాయిని ఉపయోగించారు. దీని పొడవు 1.7 కిలోమీటర్లు, కట్ట ఎత్తు 21 అడుగులు. దీని కింద ఉన్న పంట పొలాలకు నీరు అందించడానికి 58 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువలతో పాటు 73 డిస్ట్రిబ్యూటరీలను నిర్మించారు. ఈ డిస్ట్రిబ్యూటరీలను కూడా రెండు జోన్లుగా విభజించారు: 'A' జోన్ (1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలు), 'B' జోన్ (49 నుండి 73 డిస్ట్రిబ్యూటరీలు). 103 సంవత్సరాలు గడిచినా, ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ వేల ఎకరాల భూమికి జీవనాధారంగా నిలబడటంతో, ఆ నాటి నిర్మాణ నాణ్యత, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. అంతే కాకుండా ఇంతటి భారీ వరదను తట్టుకుని నిలబడి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి , మెదక్ ప్రాంతాలు వరదలో కొట్టుకుపోకుండా కాపాడింది.
మరి ఇంతటి ప్రాచీన ప్రాజెక్టులకు కనీస మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. వాటి పర్యవసానాలే ఈ భారీ వరద. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూడిక తీయడంతో పాటు.. ప్రాజెక్టుల నిర్వహణపై కూడా దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications