Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రికార్డు వరదను తట్టుకుని నిలబడి..! 103 ఏళ్ల నాటి పోచారం ప్రాజెక్టు ఇంజనీరింగ్ సీక్రెట్!

కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం, వరద నియంత్రణ సాధ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఊహించిన దానికి కంటే పోచారం ప్రాజెక్టు పైనుంచి నీరు ధాటిగా ప్రవహిస్తూ వెళ్లింది. ఈ క్రమంలోనే పోచారం ప్రాజెక్ట్ పక్కన గుంతపడటంతో ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉందని భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా గజగజ వణికిపోయారు. కానీ ఈ ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడింది. 103 ఏళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు అంతటి వరదను సైతం తట్టుకుని ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని నీటిపారుదల శాఖ ప్రకటించింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలోనే.. నిజాం కాలంలో నిర్మించిన పురాతన ప్రాజెక్టులలో పోచారం ప్రాజెక్ట్ ఒకటి. ఇది సంభవించిన భారీ వరద ప్రవాహాన్ని విజయవంతంగా తట్టుకుని నిలిచింది. ఈ ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం (MFD) 70,000 క్యూసెక్కులు మాత్రమే అయినప్పటికీ, ఇటీవల వచ్చిన 1,82,000 క్యూసెక్కుల భారీ వరదను ఇది తట్టుకోగలిగింది. ఈ అపారమైన ఒత్తిడిని సైతం తట్టుకొని ప్రాజెక్ట్ సురక్షితంగా ఉండటం నీటిపారుదల నిపుణులకు, ప్రభుత్వ వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగించింది. ఒక శతాబ్దానికి పైగా బలంగా నిలబడిన ఈ కట్టడం, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.

103-Year-Old Pocharam Project Withstands Record Floods A Timeless Engineering Marvel

పోచారం ప్రాజెక్ట్ చారిత్రక, సాంకేతిక వివరాలు
నిజాం ప్రభుత్వం నిర్మించిన తొలి ప్రాజెక్టులలో ఒకటిగా పోచారం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోయింది. దీని నిర్మాణం 1917లో ప్రారంభమై, 1922లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి విలువ ప్రకారం రూ. 27.11 లక్షలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం, పోచారం గ్రామంలో ఉన్న మంచిప్ప చెరువుపై నిర్మించారు. దీని అసలు సామర్థ్యం 2.423 టీఎంసీలు. అయితే, కాలక్రమేణా పూడిక కారణంగా దాని ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు తగ్గింది. ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాలకు సాగునీరు, తాగునీటి అవసరాలను తీరుస్తోంది. దీని కింద మొత్తం 10,500 ఎకరాలకు పైగా భూమి సాగులోకి వస్తోంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సున్నపురాయిని ఉపయోగించారు. దీని పొడవు 1.7 కిలోమీటర్లు, కట్ట ఎత్తు 21 అడుగులు. దీని కింద ఉన్న పంట పొలాలకు నీరు అందించడానికి 58 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువలతో పాటు 73 డిస్ట్రిబ్యూటరీలను నిర్మించారు. ఈ డిస్ట్రిబ్యూటరీలను కూడా రెండు జోన్‌లుగా విభజించారు: 'A' జోన్ (1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలు), 'B' జోన్ (49 నుండి 73 డిస్ట్రిబ్యూటరీలు). 103 సంవత్సరాలు గడిచినా, ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ వేల ఎకరాల భూమికి జీవనాధారంగా నిలబడటంతో, ఆ నాటి నిర్మాణ నాణ్యత, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. అంతే కాకుండా ఇంతటి భారీ వరదను తట్టుకుని నిలబడి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి , మెదక్ ప్రాంతాలు వరదలో కొట్టుకుపోకుండా కాపాడింది.

మరి ఇంతటి ప్రాచీన ప్రాజెక్టులకు కనీస మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. వాటి పర్యవసానాలే ఈ భారీ వరద. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూడిక తీయడంతో పాటు.. ప్రాజెక్టుల నిర్వహణపై కూడా దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+