వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నిప్రమాదం: యూఏఈలో 5గురు తెలుగు యువకుల మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అబూదాబి(యూఏఈ)లోని ధౌమ్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం మరికొంతమంది గాయాలపాలయ్యారు.

 5 Telangana youths die in fire mishap in UAE

అక్టోబర్ 19న ఈ ప్రమాదం జరిగినప్పటికీ.. ఆలస్యంగా మృతుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ ఎన్నారై వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు రుద్ర శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి భారత కార్మికులతో మాట్లాడారు. యూఏఈ నుంచి మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని రుద్రశంకర్ తెలిపారు.

మృతుల్లో కామారెడ్డికి చెందిన పిట్ల నరేష్(25), నిర్మల్‌కు చెందిన మలావత్ ప్రకాశ్ నాయక్(29), జి. అఖిలేష్(22), బైరి గంగరాజు(20), నిజామాబాద్‌కు చెందిన తోటా రాకేష్(32) ఉన్నారు. గాయపడిన వారిలో మెదక్ కు చెందిన మట్టెల రాజు, నిజామాబాద్‌కు చెందిన బజన్న, సిరిసిల్లాకు చెందిన సాంబయ్య, నిర్మల్ కు చెందిన తిరుపతి, రవీందర్‌లు ఉన్నారు.

English summary
At least five youths from Telangana were charred to death in a fire accident at Dhuam in Abu Dhabi (UAE) and some others were injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X