తెలంగాణలో కరోనా పంజా: 51 పాజిటివ్ కేసులు, 21 మంది డిశ్చార్జ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. శనివారం నుంచి పాజిటివ్ కేసులు సంఖ్య డబుల్ డిజిట్గా నమోదవుతోంది. శనివారం 31, ఆదివారం 33 కాగా.. సోమవారం రికార్డు స్థాయిలో 79 పాజిటివ్ కేసులు గుర్తించారు. మంగళవారం కూడా అదే ఒరవడి కొనసాగింది. 51 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. అయితే వీరిలో 37 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. 14 మంది వలసకూలీలు అని అధికారులు పేర్కొన్నారు.
51 పాజిటివ్ కేసులతో వైరస్ సోకిన వారి సంఖ్య 1326కి చేరింది. 822 మందికి వ్యాధి తగ్గడంతో డిశ్చార్జ్ చేశారు. ఇవాళ 21 మందిని ఇంటికి పంపించారు. వీరిలో హైదరాబాద్ 13, సూర్యాపేట 3, మేడ్చల్ 1, రంగారెడ్డి 3, వరంగల్ నుంచి ఒకరు ఉన్నారు. మంగళవారం వైరస్ వల్ల ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 32కి చేరింది. ప్రస్తుతం 472 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటివరకు వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తిలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. గత 14 రోజుల నుంచి కరీంనగర్, సిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణ్ పేట్, వరంగల్ అర్బన్, జనగామ, గద్వాల, నిర్మల్ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications