హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చికెన్ కోసం భార్యతో గొడవ: ఉరివేసుకుని భర్త ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యతో చికెన్ కోసం గొడవపడిన ఓ భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి రామకృష్ణానగర్‌లో నివాసం ఉండే కారు డ్రైవర్ మధు(27) ఆదివారం సినిమాకు వెళ్లి వచ్చాడు. సాయంత్రం చికెన్ తీసుకురమ్మని భార్య జ్యోతితో చెప్పాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం చికెన్ తెచ్చేందుకు జ్యోతి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి మధు ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. ఆందోళనకు గురైన జ్యోతి, స్థానికుల సాయంతో మధును ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

A man allegedly committed suicide for chicken curry in Hyderabad.

నోటు కిందపడిందని.. లాప్‌టాప్ ఎత్తుకెళ్లారు

ఆగిన కారులో ఉన్న వ్యక్తిని డబ్బులు కిందపడిపోయాయని దృష్టిమళ్లించి ల్యాప్‌టాప్ ఎత్తికెళ్లిన ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేస్‌లో నివాసముండే మధుప్రకాశ్(50) చర్చిలో ఫాస్టర్, వైద్యుడిగా పనిచేస్తున్నాడు.

సోమవారం ఉదయం 11గంటల సమయం.. తన కారులో వసంతనగర్ కమాన్ దగ్గరకు వచ్చి టూలెట్ బోర్డు ఉన్న ఇంటిని చూశాడు. ఇల్లు అద్దెకు ఇస్తారేమోనని తెలుసుకోమని డ్రైవర్‌ను అక్కడికి పంపాడు. ఇంతలో ఓ యువకుడు కారు దగ్గరికి వచ్చి పది రూపాయల నోట్లు కిందపడిపోయాయని చూపించాడు.

మధుప్రకాశ్ కారు దిగాడు. ఇంతలో మరో గుర్తు తెలియని యువకుడు కారులోని ల్యాప్‌టాప్‌ను తీసుకుని పరారయ్యాడు. మధుప్రకాశ్ కేపీహెబీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
A man allegedly committed suicide for chicken curry in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X