ప్రభుత్వంపై విపక్షాల ఒత్తిడి ,ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై క్లారిఫికేషన్ ఓకే
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అంశంపై విపక్సాలు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దరిమిలా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ అంశంపై క్లారిఫికేషన్ ప్రభుత్వం ఒప్పుకోవడంతో విపక్షాలు శాంతించాయి.
హైదరాబాద్ :పీజు రీ ఎంబర్స్ మెంట్ అంశంపై విపక్షాలు ఇవాళ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. విపక్షాలు మూకుమ్మడిగా వాయిదా తీర్మాణాలు ఇచ్చాయి. అయితే నిన్న సభలో జరిగిన ఘటనలతో ప్రభుత్వ వైఖరిని విపక్షాలు నిరసించాయి..అయితే ప్రభుత్వం ఈ విషయమై మరోసారి చర్చకు సిద్దమని ప్రభుత్వం ప్రకటించడంతో విపక్షాలు కూడ సానుకూలంగా స్పందించాయి. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత విపక్షాల సందేహలకు సమాధానం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాగానే నిన్న సభలో జరిగిన ఘటనలను ప్రదాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ప్రస్తావించారు. ఈ ఘటనలపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభ సజావుగా జరిగేందుకు విపక్షాలు అన్ని రకాలుగా సహకరిస్తున్నాయని ఆయన చెప్పారు.
విపక్షాల నుండి అన్ని రకాలుగా సహయ సహాకారాలు అందుతోన్న ప్రభుత్వం సభను వాయిదా వేసుకొని పోవడం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.పీజు రీ ఎంబర్స్ మెంట్ పై చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి సమాధానానికి విపక్షాల క్లారిఫికేషన్స్ కు ఇవ్వకపోవడం వల్ల జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయమై సభలో ఉన్న ముఖ్యమంత్రి జోక్యం చేసుకొన్నారు. సభలో మంచి సంప్రదాయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. మంచి సంప్రదాయాలను పాటిద్దాం. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై ఏ అంశంపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. . అయితే ఈ విషయమై ఏ సమస్యపై మాట్లాడేందుకు ముందుకు వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. అయితే ఇవాళ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం ప్రకటించారు. ప్రశ్నోత్తరాలఈ పరిణామాలతో విపక్ష సభ్యులు కూడ నిన్న జరిగిన ఘటనలను ప్రస్తావించారు.