నాంపల్లి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్
Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్.. సంతకం చేసిన బెయిల్ పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. కోర్టుకు అల్లు అర్జున్ వచ్చినట్లు తెలియడంతో భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పలువురు అతనితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అయితే, పోలీసులు వారిని వారించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ. 50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.

రెండు నెలలపాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ శనివారం నాంపల్లి కోర్టుకు వచ్చి పూచీకత్తు పత్రాలు సమర్పించారు.
కాగా, పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఒకరోజు తర్వాత అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
Bunny Boyy New look 🔥🖤 #Pushpa2TheRule #AlluArjun𓃵 pic.twitter.com/UYDT736Y7t
— Bunny_boy_private (@Bunnyboiprivate) January 4, 2025
అయితే, నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో అల్లు అర్జున్ వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యూలర్ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శుక్రవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరుకావాలని అల్లు అర్జున్ను ఆదేశించింది.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. తొక్కిసలాటలో తీవ్రగాయాలపాలైన ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. కోటి, దర్శకుడు సుకుమార్ రూ. 50 లక్షలు, పుష్ప2 నిర్మాతలు రూ. 50 లక్షలు సాయం అందజేసిన విషయం తెలిసిందే.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications