అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్- అదొక్కటే మార్పు

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.

తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు మిగిలిన చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేస్తోంది.

Amit Shah Telangana Tour

అటు ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు కమలనాథులు. ఇందులో భాగంగా ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. .తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. దీనికి రైతు గోస-బీజేపీ భరోసా అని పేరు పెట్టింది బీజేపీ.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:25 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2:10 నిమిషాలకు కొత్తగూడేనికి వస్తారు. మధ్యాహ్నం 2:55 నిమిషాలకు హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం 3:45 నిమిషాలకు రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్లొంటారు.

అనంతరం బీజేపీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్రస్థాయి నేతలతో చర్చిస్తారు. ఆ తరువాత ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. కాగా- ఈ షెడ్యూల్‌లో చిన్న మార్పు చోటు చేసుకుంది. తన పర్యటన సందర్భంగా అమిత్ షా భద్రాచలం శ్రీసీతారామాచంద్రస్వామివారి ఆలయాన్ని దర్శించాల్సి ఉంది. సమయాభావం వల్ల ఆలయ సందర్శనను రద్దు చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+