హైదరాబాద్కు గుడ్బై, సైకిల్ పైన అమరావతి బయలుదేరిన మహిళా ఉద్యోగి
హైదరాబాద్: విభజనలో భాగంగా ఏపీకి కేటాయించిన ఉద్యోగులు శాఖల వారీగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి బయలుదేరుతున్నారు. సహకార, వాణిజ్య, సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో విజయవాడ బయల్దేరారు.
వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న అధికారిణి పద్మ తన ప్రయాణాన్ని అందరికంటే భిన్నంగా ఎంచుకోవడం గమనార్హం. గురువారం 150 మంది ఉద్యోగులు బస్సులో బయలుదేరారు. శుక్రవారం మరికొందరు బయలుదేరారు.
అమరావతి వెళ్లేందుకు ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపేందుకు పద్మ సైకిల్ పైన అమరావతి బయలుదేరారు. ఏపీఎన్జీవో సంఘం నేతలు అశోక్ బాబు, కృష్ణయ్య తదితరులు ఆమెకు మద్దతు తెలిపారు. అశోక్ బాబు జెండా ఊపి ఆమె సైకిల్ ప్రయాణాన్ని ప్రారంభింప చేశారు.

హైదరాబాద్ టు అమరావతి
అమరావతికి వెళ్తున్న ఏపీ ఉద్యోగులు కంటతడి పెట్టారు! ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యోగులతో కలిసి పని చేసి, వారిని విడిచి పోతున్నందుకు కొందరు, తెలంగాణ ఉద్యోగుల్లో తమ ప్రాణ స్నేహితులకు దూరమవుతున్నందుకు మరికొందరు కంటతడి పెట్టారు.

హైదరాబాద్ టు అమరావతి
ఇటు తెలంగాణ, అటు ఏపీ ఉద్యోగులు కూడా ఒకరినొకరు దగ్గరకు తీసుకొని కంటతడి పెట్టారు. ఇది చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. విభజన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్తున్నారు.

హైదరాబాద్ టు అమరావతి
గురువారం నాడు మొదటి బ్యాచ్ తరలి వెళ్లింది. శుక్రవారం నాడు మరికొంతమంది హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరారు.

హైదరాబాద్ టు అమరావతి
ఏపీకి కేటాయించబడిన ఉద్యోగులు అమరావతికి వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. దీంతో, ఉద్యోగులు అమరావతికి తరలుతున్నారు.

హైదరాబాద్ టు అమరావతి
ఏపీకి కేటాయించబడిన ఉద్యోగులు అమరావతికి వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. దీంతో, ఉద్యోగులు అమరావతికి తరలుతున్నారు.

హైదరాబాద్ టు అమరావతి
ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న అధికారిణి పద్మ సైకిల్ పైన వెళ్లాలని నిర్ణయించుకొని, అలా వెళ్తున్నారు.

హైదరాబాద్ టు అమరావతి
వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న అధికారిణి పద్మ శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి అమరావతికి సైకిల్ పైన బయలుదేరారు.
-
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..!












Click it and Unblock the Notifications