బాబు గోగినేనిపై చర్యలు జాప్యం, నోటీసులివ్వాలని కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: తీవ్ర నేరాపరోణలు ఎదుర్కొంటున్న బాబు గోగినేనికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ 2 షోలో ఉన్నారు. త్వరలో మాదాపూర్ పోలీసులు బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే అవకాశముంది.
గత నెలలో బాబు గోగినేనిపై కేసు నమోదు అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు పురోగతిపై ఈ నెల 25 తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

గత నెలలో దేశద్రోహం, మతాలు, కులాలు, వర్గాల పేరిట ప్రజల్లో విద్వేష భావనను రేకెత్తించడం నేరపూరితమైన నమ్మక ద్రోహం, మోసం, దురుద్దేశంతో శాంతిని భగ్నపరచడం, వర్గాల నడుమ శత్రు భావనను పెంపొందించడం, మత విశ్వాసాలను అవమానించడం, అనుచిత ప్రచారంతో పాటు ఆధార్ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications