ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుకే కేసీఆర్ ఫాం హౌస్ నుంచి రావడం లేదు: దావత్ ఇస్తామంటూ బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుంటే.. యశోద ఆస్పత్రి వైద్యులు చికిత్స చేస్తున్నారని చెప్పారు. పెద్దోళ్లకు యశోద ఆస్పత్రి చికిత్స.. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేస్తుందని బండి సంజయ్ విమర్శించారు.

కేసీఆర్ ఖమ్మం వచ్చి డబుల్ బెడ్ రూంలు ఇస్తానన్న హామీ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక్కడకు వచ్చినప్పుడు దావత్ కావాలని అన్నారని.. రా కేసీఆర్.. నీకు ఏ దావత్ కావాలంటే ఆ దావత్ ఇస్తామంటూ ఎద్దేవా చేశారు. భూ నిర్వాసితులకు పట్టాలు ఇవ్వమని టీఆర్ఎస్ సర్కారు బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.

 bandi sanjay fires at cm kcr for various issues in telangana

కాంట్రాక్టర్ల పేరుతో టీఆర్ఎస్ వాళ్లే అక్రమాలు చేస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. ఎవరి నుంచి డబ్బులు తీసుకున్నా.. ఓట్లు మాత్రం కమలం పువ్వు గుర్తుకు వేయాలని ఆయన అన్నారు. కరోనా కష్టకాలంలో పేదలకు సేవలు చేస్తూ ఏడుగురు కార్యకర్తలు చనిపోయారని అన్నారు. కరోనా చికిత్సకు డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవేనని అన్నారు.

Recommended Video

Kangana Ranaut Slams Shiv Sena MP Sanjay Raut || Oneindia Telugu

డబుల్ బెడ్రూంలు నాణ్యత లేదంటే పేదల మీద కేసులు పెడతారా? ఇదేమీ న్యాయమూంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇస్తే.. ఒక్క ఇల్లు కూడా కట్టడం లేదని మండిపడ్డారు. రోజూ బీజేపీ కలలోకి వస్తుందని.. దీంతో కేసీఆర్‌కు నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. బీజేపీ అంటే భయపడుతున్నారని.. అందుకే ఫాంహౌస్‌లో నుంచి బయటకు రావడం లేదని బండి సంజయ్ విమర్శించారు. కలలో వస్తుంది.. బిజెపి అంటేనే భయ పడుతున్నారని.. అందుకనే ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని పేర్కొన్నారు.

English summary
bandi sanjay fires at cm kcr for various issues in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X