ఈటలకు రాజేందర్ కు బిగ్ షాక్.. జమునా హేచరీస్ భూముల పంపిణీకి రంగం సిద్ధం
బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఈటల రాజేందర్ కు చెందిన వివాదాస్పదమైన జమున హేచరీస్ భూములకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈటల చేతిలో ఉన్న భూములను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో జమున హేచరీస్ కు చెందిన భూముల వ్యవహారాన్ని తేల్చే పనిలో పడిన అధికారులు ఈటల కు సంబంధించిన భూములను రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులతో కలెక్టర్ కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జమున హేచరీస్ సంస్థ దళితుల నుండి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిందని గతంలోనే జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. దీంతో ఈటల చేతిలో ఉన్న భూములను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసైన్డ్ లబ్ధిదారులుగా ఉన్న 56మంది దళితులకు జమునా హేచరీస్ భూముల పంపిణీ
ఈ క్రమంలోనే జమున హేచరీస్ భూములను అసైన్డ్ లబ్ధిదారులుగా ఉన్న 56మంది దళితులకు పంపిణీ చేయనుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ ను ఓడించాలని శతవిధాల ప్రయత్నం చేసినా టిఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలుపొంది సత్తా చాటారు. ఇక ఈటల రాజేందర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు జమున హేచరీస్ కు సంబంధించిన భూములను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జమునా హేచరీస్ భూముల విషయంలో ఈటల బర్తరఫ్ .. బీజేపీలో చేరిక
ఇదిలా ఉంటే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట లో జమునా హేచరీస్ దళితుల నుండి భూములను కొనుగోలు చేసింది. అయితే ఈ భూముల విషయంలో ఈటల రాజేందర్ పై అక్రమంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ కేసు నమోదైంది. ఇక ఇదే వ్యవహారంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి అత్యంత అవమానకర రీతిలో బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి తీర్థం తీసుకున్నారు.

70.33ఎకరాల భూమి 56 మంది రైతులకు పంచనున్న తెలంగాణా సర్కార్
ఇక సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ ను మరింత ఇరకాటంలో పెట్టడానికి జమున హేచరీస్ భూములపై విచారణ జరిపించి నివేదిక ఆధారంగా భూములను పంచాలని నిర్ణయం తీసుకున్నారు. 56మంది రైతులకు సంబంధించి మొత్తం 70.33 ఎకరాల భూమి కబ్జా అయినట్టు పేర్కొని దానిని పంచాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 2,3 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ సమయంలో ఈటలకు షాక్ ఇస్తుంది గులాబీ సర్కార్.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications