ఈటలకు రాజేందర్ కు బిగ్ షాక్.. జమునా హేచరీస్ భూముల పంపిణీకి రంగం సిద్ధం
బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఈటల రాజేందర్ కు చెందిన వివాదాస్పదమైన జమున హేచరీస్ భూములకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈటల చేతిలో ఉన్న భూములను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో జమున హేచరీస్ కు చెందిన భూముల వ్యవహారాన్ని తేల్చే పనిలో పడిన అధికారులు ఈటల కు సంబంధించిన భూములను రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులతో కలెక్టర్ కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జమున హేచరీస్ సంస్థ దళితుల నుండి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిందని గతంలోనే జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. దీంతో ఈటల చేతిలో ఉన్న భూములను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసైన్డ్ లబ్ధిదారులుగా ఉన్న 56మంది దళితులకు జమునా హేచరీస్ భూముల పంపిణీ
ఈ క్రమంలోనే జమున హేచరీస్ భూములను అసైన్డ్ లబ్ధిదారులుగా ఉన్న 56మంది దళితులకు పంపిణీ చేయనుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ ను ఓడించాలని శతవిధాల ప్రయత్నం చేసినా టిఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలుపొంది సత్తా చాటారు. ఇక ఈటల రాజేందర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు జమున హేచరీస్ కు సంబంధించిన భూములను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జమునా హేచరీస్ భూముల విషయంలో ఈటల బర్తరఫ్ .. బీజేపీలో చేరిక
ఇదిలా ఉంటే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట లో జమునా హేచరీస్ దళితుల నుండి భూములను కొనుగోలు చేసింది. అయితే ఈ భూముల విషయంలో ఈటల రాజేందర్ పై అక్రమంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ కేసు నమోదైంది. ఇక ఇదే వ్యవహారంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి అత్యంత అవమానకర రీతిలో బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి తీర్థం తీసుకున్నారు.

70.33ఎకరాల భూమి 56 మంది రైతులకు పంచనున్న తెలంగాణా సర్కార్
ఇక సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ ను మరింత ఇరకాటంలో పెట్టడానికి జమున హేచరీస్ భూములపై విచారణ జరిపించి నివేదిక ఆధారంగా భూములను పంచాలని నిర్ణయం తీసుకున్నారు. 56మంది రైతులకు సంబంధించి మొత్తం 70.33 ఎకరాల భూమి కబ్జా అయినట్టు పేర్కొని దానిని పంచాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 2,3 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ సమయంలో ఈటలకు షాక్ ఇస్తుంది గులాబీ సర్కార్.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications