వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదాద్రిలో గులాబీ ప్రచారానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

KCR పై విరుచుకుపడ్డ కుసుమ కుమార్ || Kusuma Kumar Comments On KCR Photo In Yadadri Temple || Oneindia

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ టిఆర్ఎస్ పార్టీని యాదాద్రి ఆలయంలో గులాబీ ప్రచారం అంశంలో టార్గెట్ చేశారు. ఇంతవరకు ఎవరూ చెయ్యని విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా రాజకీయ రంగు పులమటం బీజేపీ నేతలకు ఏ మాత్రం నచ్చటం లేదు. దీంతో కేసీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో సైతం ఈ ఉదంతం వైరల్ గా మారింది. కేసీఆర్ అనే ఒక మహారాజు అంటూ వ్యంగ్య కథలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక బీజేపీ ఈ అంశాన్ని బేస్ గా తీసుకుని టీఆర్ ఎస్ ను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది.ఇక అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు.

బీజేపీ చేతికి మరో అస్త్రం ... బొమ్మలే కాదు అవినీతిని చెక్కుతారా! యాదాద్రిలో రాజాసింగ్ హల్ చల్బీజేపీ చేతికి మరో అస్త్రం ... బొమ్మలే కాదు అవినీతిని చెక్కుతారా! యాదాద్రిలో రాజాసింగ్ హల్ చల్

కల్వకుంట్ల కుటుంబ ఆగడాలు శృతి మించాయని మండిపడిన లక్ష్మణ్ యాదాద్రి రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్‌తో పాటు కారు బొమ్మలు చెక్కడాన్నిబీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రచారానికి దీనిని పరాకాష్టగా చెప్పొచ్చు అన్నారు . హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కేసీఆర్‌ తీరు ఉందన్న లక్ష్మణ్ ఇలాంటి ఘటనలను సహించేది లేదని పేర్కొన్నారు. ఇక దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

BJP Lakshman slams kcr and trs party campaign in Yadadri

ఇప్పటికైనా చేసిన పొరపాటును ప్రభుత్వం సరిదిద్దుకోవాలన్నారు.వెంటనే యాదాద్రి ఆలయంలో కేసీఆర్, కారు , సర్కారు చిత్రాలను తొలగించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనితో ఆలయ ప్రతిష్టకి భంగం కలుగుతుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఎవరూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు దేవాలయాల మీద చెయ్యలేదని మండిపడ్డారు.ఇక దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు.

English summary
Telangana BJP state president Dr Laxman shocked the TRS party carvings in yadadri temple . Lakshman came down heavily on Chief Minister K Chandrashekar Rao over the allegations of his photo and TRS logo carved in Yadadri temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X