పరిపూర్ణానంద బహిష్కరణ: బీజేపీ ‘చలో ప్రగతిభవన్’ భగ్నం, ఎక్కడికక్కడ అరెస్టులు
హైదరాబాద్: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఛలో ప్రగతిభవన్ను పోలీసులు భగ్నం చేశారు. బీజేపీ కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని బషీర్బాగ్లోని సీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేశారు. ఆయనను రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బాద్దం బాల్ రెడ్డిని అసెంబ్లీ వద్ద అరెస్త్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిగతిభవన్కు బయలుదేరిన ఎమ్మెల్సీ రామచందర్ రావును తార్నాకలోని ఇంటివద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు గృహ నిర్భంధం చేశారు.

-
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
విజయవాడ ఉగ్ర కుట్ర కేసు: ఇన్స్టా రీల్స్ వెనుక భయంకరమైన కోణం? -
హోటల్ మేనేజ్మెంట్ లో ఆన్ లైన్ శిక్షణ, ఉద్యోగాలు- అర్హతలు..!! -
జీవన్ రెడ్డి BRS లో చేరికపై తేల్చేసిన కేసీఆర్, వాట్ నెక్స్ట్..!! -
హాట్ సమ్మర్ లో ఈ కూల్ ప్రదేశాలను చుట్టేయండి.. హైదరాబాద్ కు దగ్గరలోనే.. -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా?












Click it and Unblock the Notifications