పరిపూర్ణానంద బహిష్కరణ: బీజేపీ ‘చలో ప్రగతిభవన్’ భగ్నం, ఎక్కడికక్కడ అరెస్టులు
హైదరాబాద్: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఛలో ప్రగతిభవన్ను పోలీసులు భగ్నం చేశారు. బీజేపీ కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని బషీర్బాగ్లోని సీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేశారు. ఆయనను రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బాద్దం బాల్ రెడ్డిని అసెంబ్లీ వద్ద అరెస్త్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిగతిభవన్కు బయలుదేరిన ఎమ్మెల్సీ రామచందర్ రావును తార్నాకలోని ఇంటివద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు గృహ నిర్భంధం చేశారు.

-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం












Click it and Unblock the Notifications